మౌంట్ అబూ వన్య ప్రాణి అభయారణ్యం ఈ పర్వత కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడవలసిన ఆకర్షణ. ఆరావళి పర్వత శ్రేణులలోని పీఠభూమి లో 19 కి. పొడవు 5-8 వెడల్పున ఈ అభయారణ్యం వ్యాపించి ఉంది. 1960 లో దీనిని వన్య ప్రాణి అభయారణ్యంగా ప్రకటించారు. ఈ ప్రదేశం వివిధ రకాల వృక్ష జంతు జాలాలను కల్గి ప్రకృతి ప్రేమికులకు వన్యప్రాణి ఔత్సాహికులకు కను విందు కల్గిస్తుంది. మౌంట్ అబు వన్య ప్రాణి అభయారణ్యం మంచి వృక్షసంపద కల్గిన ప్రత్యేకమైన ప్రాంత౦. ఇది 820 రకాలకు పైగా వృక్ష జాతులకు పుట్టిల్లు.
అంతేకాక, ఇక్కడ అనేక రకాల ఆర్చిడ్ పుష్పాలను కూడా చూడవచ్చు. పరిసరాల పచ్చదనంతో బాటు ఈ అభయారణ్యం జంతుజాలానికి కూడా ఎంతో ప్రసిద్ది చెందింది. వన్య ప్రాణి ప్రియులు ఈ ప్రాంతంలో అంతరించి పోతున్న అనేక రకాల అద్వితీయ జంతు జాతులను చూసి ఆనందించ వచ్చు.గతంలో ఈ కొండలలో సింహాలు, పులులు ఉన్నపటికీ ప్రస్తుతం పిల్లి జాతికి చెందిన మాంసాహార చిరుతపులులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రదేశం ఇతర వన్యమృగ జాతులైన సాంబార్ జింక, అడవి పంది, ఎలుగుబంటి, నక్క, భారతదేశ నక్క, తోడేళ్ళు, హైన, చిన్న భారత పునుగు పిల్లులు, అడవి పిల్లులను కల్గి ఉంది.



Click it and Unblock the Notifications