రాజస్థాన్ లోని పాలి జిల్లా లో మహావీర భగవానునికి చెందిన ముచ్చల్ మహావీర్ దేవాలయం ఉంది.ఘనే రావు కు 5 కి.మీ. దూరంలో కు౦భాల్ ఘర్ అభయారణ్యంలో ఈ దేవాలయం కలదు.ఈ దేవాలయంలో శివుడికి మీసాలు కల్గి ఉన్న విగ్రహ౦ ఉంటుంది. దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద రెండు ఏనుగుల విగ్రహాలు పహారా కాస్తునట్లుగా నిలబడి కనిపిస్తాయి.ఇక్కడకు దగ్గరలోని గరేశియా గిరిజన గ్రామాలు ఈ ప్రాంతానికి ఆకర్షణలు. ఇక్కడినుండి పర్యాటకులు అందమైన సాంప్రదాయ దుస్తులను కొనుగోలు చేయవచ్చు.