రానక్ పూర్ జైనులకు చెందిన ఐదు తీర్థయాత్ర ప్రాంతాలలో రానక్ పూర్ జైన దేవాలయం ఒకటిగా పరిగణించ బడుతుంది.అధినాద్ దేవునికి చెందిన ఈ దేవాలయం ఆరావళి పర్వత శ్రేణులలో పశ్చిమ ప్రాంతంలో ఉంది.లేత రంగు పాలరాతితో నిర్మింఛినా ఈ కట్టడం ఎంతో అందంగా కనబడుతుంది.
ఇతిహాసం ప్రకారం ఈ దేవాలయాన్ని జైన వ్యాపారవేత్త అయిన సేథ్ ధర్నా షా, మేవార్ పాలకుడైన రాణా ఖుంభా నిర్మించారు.ప్రధాన దేవాలయ ప్రాంగణమైన చముఖ ఇతర జైన దేవాలయాలను కల్గి ఉంది.ఈ దేవాలయ౦ 48,000 చదరపు అడుగుల మేర విస్తరించి ఉంది.దీని లో వుండే 80 డోములు, 29 సభా మంటపాలు, 1,444 స్తంభాలు ఆ శకపు కళాకారుల నిర్మాణ కౌశలం వర్ణిస్తాయి.ఒక్కొక స్తంభం వేర్వేరు విశిష్టతలను కల్గి ఉండటం వీటి ప్రత్యేకత.ఒక్కొక స్తంభం వేర్వేరు రకాలైన చెక్కడాలను కల్గి ఉంటుంది. పార్శ్వ నాథ దేవాలయం, నేమి నాథ దేవాలయం ప్రధాన దేవాలయనికి ఎదురుగా ఉంటాయి.ఈ దేవాలయాల పై గల అందమైన చిత్రాలు సందర్శకులకు ఖజురహో శిల్పాలను గుర్తుకు తెస్తాయి.