రోయింగ్ ప్రధానటౌన్ షిప్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజోమాఘాట్ ఒక విహారయాత్రా ప్రదేశం. ఈ చారిత్రిక ప్రదేశాన్ని నిజాంఘాట్ అని కూడా పిలుస్తారు. పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారు వారి రాజకీయ అధికారి జె.ఎఫ్. నీధం పేరున దీనిని స్థాపించారు. నిజోమాఘాట్ ను బ్రిటిష్ వారు కొండలకు ప్రవేశంగా ఉపయోగించేవారు. చారిత్రిక ప్రాధాన్యత తో బాటు అందమైన దృశ్యాలకు నిజోమాఘాట్ ప్రసిద్ధి.
చుట్టూ విస్తరించిన పచ్చదనం పరిసరాలను తాజాగా ఉంచుతుంది. ఎత్తైన పర్వతాలు, రాతి ప్రదేశాలు ఈ ప్రాంతం చుట్టూ ఉన్నాయి. ఈ ప్రాంతం గుండా ప్రవహించే నది విహారయాత్రలకు అనుకూలంగా ఉంటుంది. రోయింగ్ ను ఫెర్రీ ద్వారా దంబుక్ కు కలిపారు, దీనిని పర్యాటకులు ఆనందించవచ్చు. నది అల్లరిచిల్లరి ప్రవాహాల వలన ఆశ్చర్యం కలిగించే రూపాలు హిమాలయాల గట్టి రాళ్ళలో ఏర్పడ్డాయి. నిజోమాఘాట్ నుండి కనబడే పూర్తి పర్వత శ్రేణి కనువిందు చేస్తుంది.