చౌత మాత దేవాలయం, సవాయి మాధో పూర్ లోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఇది పేరుకు తగినట్లుగానే ఈ ప్రాంతపు పాలకుల ప్రధాన దేవతైన చౌత మాతకు చెందినది. విభిన్న సందర్భాలలో ఈ దేవాలయం అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది. నగరానికి 35 కి. మీ. దూరంలో ఒక కొండపై గల ఈ దేవాలయం రాజస్తాన్లోని ఈ పట్టణ పరిసరాలలో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ.
ఈ దేవాలయం అందమైన పచ్చని పరిసరాలు, గడ్డి మైదానాల మధ్య ఉంది. రాజపుత్రుల నిర్మాణ శైలి లక్షణాలను కల్గి, తెల్లటి పాలరాతితో అందంగా నిర్మించిన ఈ కట్టడం గోడలు, పై కప్పు పై శాసనాలు లిఖించబడ్డాయి.ఈ దేవాలయానికి చేరడానికి చాలా మెట్లు ఎక్కవలసి రావడమే ఒక పెద్ద పని.
ఈ దేవాలయాన్ని సమీపంలోని పాంచాల గ్రామం నుండి చౌత మాత విగ్రహాన్ని తెచ్చిన భీం సింగ్ మహారాజు నిర్మించాడు. ఈ దేవత విగ్రహంతో బాటుగా గణేషుడు, భైరవుని విగ్రహాలను దేవాలయ ప్రాంగణంలో చూడవచ్చు.