భైదియా కుండ్ అనేది ప్రకృతి సిద్దమైన సహజ సిద్దమైన ఔషద గుణాలున్న అతి కొద్ది ప్రదేశాలలో ఒకటి. మధ్య ప్రదేశ్ టూరిస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెంచర్ చేత అబివృద్ది చేయబడిన పర్యాటక ప్రదేశం. ఇందులో పర్యాటకుల కోసం సురక్షితమైన, శుభ్రమైన హోటల్లు కలవు. గ్వాలియర్ నుండి 112 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ పర్యాటక గ్రామం మధ్య భారత దేశాన్ని సందర్శించే వారు తప్పక చూడాల్సిన ప్రదేశం.
సహజ సిద్దమైన ప్రకృతి అందాలతో అధ్బుతం గా ఉండే ఈ ప్రాంతం శివపురి నుండి ఎంతో దూరం లో లేదు. శివపురి లో ని ఘనమైన ప్రకృతి దృశ్యాలలో ఎన్నో పిక్నిక్ ఏరియాలు ఉన్నప్పటికీ భదైయా కుండ్ లో ఉన్న కొన్ని లక్షణాలు దీనిని మిగతా వాటినుండి ప్రత్యేకంగా నిలుపుతాయి. భదైయా కుండ్ లో ఉన్న నీటి ప్రవాహం లో మినరల్ శాతం ఎక్కువగా ఉంటుందని అంటారు.
ప్రాచీన నమ్మకాల ప్రకారం దీనిలో ఎక్కువగా ఔషద గుణాలు ఉన్నాయని తెలుస్తోంది. చికిత్సాపరమైన లక్షణాలు ఈ నీటిలో ఉన్నాయని అంటారు. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం వర్షాకాలం. ఈ సమయం లో నీళ్ళు నిండుగా ఉండి కనులకి విందుగా ఉంటాయి.