శివపురి కి సమీపం లో ఉన్న ఆలయం ఇది. చరిత్రపై హిందువుల సంప్రదాయ అలాగే సంస్కృతిక నమ్మకాల ప్రకారం కొన్ని ప్రాచీన ఆధ్యాత్మిక ప్రాంతాలు పరిరక్షింపబడ్డాయి. 6వ మరియు 7 వ శతాబ్దానికి చెందిన ఆలయాలకు 21 వ శతాబ్దానికి చెందిన భక్తులు ఉండడానికి కారణం ఆ ఆలయాల నిర్మాణం నుండి ఉన్న భక్తుల వంశపారంపర్యంగా భక్తులు ఏర్పడటం.
మహువా శివ టెంపుల్, తెరహి టెంపుల్ అలాగే సిద్దేశ్వరా టెంపుల్ వంటివి ఈ ప్రాంతం లో రాజులూ రాజ్యాలు ఉన్న సమయం లో నిర్మించబడినవి. అటువంటి శకానికి చెందినదే ఈ ఆలయం. శివపురి నుండి 65 కిలోమీటర్ల దూరం లో ఈ ఆలయం ఉంది. శివపురి లో ని ప్రాచీన దేవాలయాలు ఎన్నో శివుడికి అంకితమివ్వబడినవి ఉన్నప్పటికీ ఈ ఆలయం దట్టమైన అడవుల మధ్యలో ఉండటం దీని ప్రత్యేకత. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం ఏంతో మందిని ఆకట్టుకుంటోంది.