దాదాపు ఎనిమిది వందల కంటే ఎక్కువ సంవత్సరాల క్రితానికి చెందిన శ్రీ శాంతినాథ్ దిగంబర్ జైన్ అతిశయ క్షేత్ర చారిత్రక నగరం అయిన శివపురి నుండి 13 కిలోమీటర్ల దూరం లో ఉన్న పురాతన ఆలయం. ఆగ్రా-ముంబై హైవే నుండి సేసై అనే చిన్న పట్టణం లో ఉన్న ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. పేరుకు తగ్గట్టు ఈ ఆలయం జైన సంఘం లో ని సభ్యులకు అతి పవిత్రమైనది.
ఈ ఆలయ సముదాయంలో కలిగిన మ్యూజియం జైన మతం చరిత్ర మరియు ఇతర వివరాలను తెలియచేస్తుంది. ఈ మ్యూజియంలో పురాతన భారత దేశానికి చెందిన జైన విగ్రహాలు ఉన్నాయి. ఈ మతం గురించి తెలుసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈ ఆలయం గర్భగుడిలో 15 అడుగుల ఎత్తు కలిగి ఉన్న విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. బ్రౌన్ కలర్ లో ఉన్న ఈ విగ్రహం ఎనిమిది లోహాల మిశ్రమం తో తయారు అయిందేమోనని భావిస్తారు.