17వశతాబ్దానికి చెందిన శ్రీ మరికాంబ దేవాలయం పర్యాటకులు తప్పక చూడాలి. ఇక్కడ గల 7 అడుగుల చెక్క విగ్రహ దేవత మరికాంబను దర్శించేందుకు భక్తులు తరలి వస్తారు. ఈ విగ్రహం ఒకప్పుడు సిర్సి పట్టణ పొలిమేరలలో ఒక నీటి సరస్సులో లభించినట్లు స్ధానికులు చెపుతారు. 1611 సంవత్సరంలో సోండా రాజు రెండవ సదాశివ రావు ఆ చెక్క విగ్రహాన్ని ఈ ప్రదేశంలో ప్రతిష్టించారు. అప్పటినుండి ఆ దేవి ఇక్కడ పూజలు అందుకుంటోంది. భక్తుల కోరికలు తీరుస్తోంది. సిర్సిలో ఈ దేవతా విగ్రహాన్ని మాత్రమే కాక, భక్తులు కావి కళ కూడా ఈ దేవాలయ గోడలపై చూస్తారు. మరికాంబ జాతర ఒక ప్రత్యేక ఆకర్షణ. రెండేళ్ళకోసారి చేసే ఈ జాతరకు లక్షలాది భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వస్తారు. మరికాంబ దేవత అక్కడ ఉండటం వలననే ఆ ప్రాంతం చెడునుండి సంరక్షించబడుతున్నట్లు స్ధానికులు భావిస్తారు. సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తున ఉన్న ఈ దేవాలయం కొండలు, అడవులు, అనేక జలపాతాలతో చుట్టుముట్టి ఉంటుంది.



Click it and Unblock the Notifications