అగ్నిగర్హ చూడకపోతే తేజ్ పూర్ యాత్ర పూర్తికానట్లే. ఈ ప్రదేశం అనిరుద్ధుడు, రాణి ఉష ప్రేమను వివరిస్తుంది, తరువాత శ్రీకృష్ణుడికి, బనసురుడికి భారీ యుద్ధం జరిగి౦ది. ఆశక్తికరంగా, ఈ మొత్తం కధ జీవ౦ఉన్న విగ్రహాలను ఉపయోగించి తిరిగి చెప్పబడింది. ఈ విగ్రహాలు అగ్నిగర్హ కోట మొత్తం వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి.
ఈ ప్రదేశం ఒక ఎత్తైన భూమి – చిన్న కొండ – అగ్నిగర్హ వెళ్ళడానికి వృత్తాకారపు మెట్లు ఎక్కి చేరుకోవచ్చు. ఈ ప్రదేశానికి సంబంధించి మరో ఆశక్తికర కధ ఉంది. ఉష చెలికత్తె అయిన చిత్రలేఖ గొప్ప చిత్రకారి, ఆమె తన కలలో కనిపించిన వ్యక్తి చిత్రాన్ని గీసిందని నమ్మకం. ఆమె ఆ చిత్రాన్ని ఉష దగ్గరకు తీసుకువచ్చి, తరువాత అది తన ప్రియుడు అనిరుద్ధుని చిత్రం అని చెప్పింది. అగ్నిగర్హ పైనుండి పట్టణం మొత్తాన్నీ చూడవచ్చు. ఇది స్థానికులకు అదేవిధంగా పర్యాటకులకు కూడా ప్రసిద్ధ పర్యాటక కేంద్రం.