మహాభైరవ ఆలయం తేజ్ పూర్ లోని తప్పక సందర్శించాల్సిన ఆలయాలలో ఒకటి. నగరానికి ఉత్తర సరిహద్దున ఉన్న ఈ మహాభైరవ ఆలయం శివునికి అంకితం చేయబడింది. నిజానికి ఈ ఆలయాన్ని రాక్షస రాజు బాణాసురుడు నిర్మించారని చెప్తారు. పూర్వం ఇది రాతి ఆలయం,1897 భూకంపంలో పాడైపోయి౦ది. ఇప్పుడు ఈ ఆలయం కాంక్రీటు తో తయారుచేయబడింది.
ప్రస్తుత నిర్మాణం నాగ బాబా అని పిలువబడే ప్రసిద్ధ సన్యాసిచే నిర్మించబడింది. ఈ ఆలయం లోని శివలింగం చాలా పెద్దది. చిన్న కొండపై ఉన్న ఈ మహాభైరవ ఆలయ ప్రవెశద్వార౦ రెండు వైపులా వినాయకుడు, హనుమంతుని విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రవేశద్వారం లోపలి భాగం మరింత అందంగా చెక్కబడి విశాలంగా ఉంది. ఈ మహాభైరవ ఆలయంలో ఫిబ్రవరి- మార్చ్ సమయంలో శివరాత్రి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ ఆలయం చుట్టూ భక్తులు కూర్చుని, వారి సమయాన్ని గడపడానికి పెద్ద స్థలం ఉంది.