భైరవి ఆలయం దుర్గాదేవి కి అంకితం చేయబడింది. తేజ్ పూర్ శివార్లలో ఉన్న ఈ ఆలయం, బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తున్న కొలియ భోమోర వంతెన మొత్త౦ మనోహరంగా కనిపిస్తుంది. భైరవి ఆలయం బాముని కొండల శిధిలాలకు దగ్గరగా ఉంది.
బనసురుని కూతురైన ఉష ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి దుర్గామాత ను పూజించేదని నమ్మకం. ఈ ఆలయం చాలా పాతది అనడానికి ఇదే సాక్ష్యం. ఈ ఆలయంలో ఇప్పటికీ జంతుబలులు పాటిస్తారు. భక్తులు, పర్యాటకులు మెట్లతో కూడిన పొడవైన మార్గంలో భైరవి ఆలయాన్ని చేరుకోవాలి. ఈ ఆలయం ఒక చిన్న కొండపై ఉంది. ప్రస్తుతం, ఈ ఆలయం డిస్ట్రిక్ట్ డిప్యుటీ కమీషనరు కార్యాలయం వారిచే నిర్వహించబడుతుంది.
భారవి ఆలయ పర్యటన కష్టం కాదు. పర్యాటకులు ఒక వాహనాన్ని మాట్లాడుకోవచ్చు లేదా ఈ మార్గంలో వెళ్ళే బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. భారవి ఆలయం నగరానికి దక్షిణాన ఉంది.