జముగురి వద్ద ఉన్న నాగ శంకర్ ఆలయం తేజ్ పూర్ పట్టణానికి సమీపంలో ఉంది. ఈ ఆలయం నగాఖ రాజు నరసంకర్ చే క్రీశ. 4 వ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు. 15 వ శతాబ్దంలో (షుమారు 1480), అహోం రాజు సు-సేన్-ఫ ప్రార్ధనలు చేసే పురాతన స్థలానికి మరమ్మత్తులు చేయించాడు. ఈ ఆలయ నిర్మాణాన్ని అనుకుని పెద్ద చెరువు ఉంది. ఈ చెరువులో, అనేక రకాల సున్నిత పెంకు ఉన్న తాబేళ్ళను చూడవచ్చు. ఈ చెరువులో సాధారణంగా చేపలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని అనుకుని ఉన్న ప్రదేశంలో నెమళ్ళు, జింకలు, కొండచిలువలు వంటి అనేక రకాల జంతువులు కూడా ఉన్నాయి. నెమళ్ళు నాగ్ శంకర్ ఆలయంలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి.
తేజ్ పూర్ నగర కేంద్ర నుండి షుమారు 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న జముగురి నుండి పర్యాటకులు సోనిత్పూర్ జిల్లాలోని చిన్న గ్రామాలను చేరుకోవడానికి వాహనాలను బుక్ చేసుకోవచ్చు. పర్యాటకులు జముగురిహాట్ చేరుకోవడానికి 52 వ జాతీయ రహదారిపై (ఆలయం ఉన్న ప్రదేశం) ప్రయాణం చేయాలి.



Click it and Unblock the Notifications