దక్ష యాగం సమయంలో అవమానం పొందిన సతీదేవి ఆత్మార్పణ చేసుకోవడం, అటు పై ఆమె దేహాన్ని మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో 51 భాగాలుగా చేయగా అవి భూమి పై వివిధ ప్రాంతాల్లో పడిన విషయం తెలిసిందే. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే శక్తి పీఠాలుగా ప్రజలతో పూజలందుకొంటున్నాయి. అలా సతీదేవి కనుగుడ్డు పడిన ఈ దసరా సందర్భంగా ఈ ప్రాంతాన్ని గురించి తెలుసుకొందాం.
అద్దె ఇంట్లో ఉంటున్నారా? ఇక్కడికి వెళితే మీ గురుబలం రెట్టింపవుతుంది
మీలో సత్తువ ఉంటే 'ఆ' పనితో ఇక్కడ ఆమె ఒళ్లంత చమటలే
తారాపీఠ్, శక్తిపీఠం
P.C: You Tube
పశ్చిమ బెంగాల్ లోని కొలకత్తకు దగ్గర్లోని బిరుబీమ్ నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయం శక్తి పీఠాల్లో అత్యంత ముఖ్యమైనది అని స్థానికులు చెబుతుంటారు.
తారాపీఠ్, శక్తిపీఠం
P.C: You Tube
హిందువలకు అత్యంత పవిత్రమైన ఈ దేవాలయాన్ని అఘెరాలు, నాగసాదువులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. అందువల్లే ఈ దేవాలయాన్ని అఘెర దేవాలయం అని అంటారు.
తారాపీఠ్, శక్తిపీఠం
P.C: You Tube
ఇక్కడ సతీదేవి కనుగుడ్డు పడిందని చెబుతారు. బెంగాళీలో కనుగుడ్డును తార అని పిలుస్తారు. అందుల్లే మొదట చందీపూర్ అని పేరు ఉన్న ఈ ఊరి పేరు తారాపీఠ్ అని మారిపోయింది.
తారాపీఠ్, శక్తిపీఠం
P.C: You Tube
ఈ దేవాలయంలో కాళికా రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఇక్కడి దేవతను శాంతపరచడానికి ప్రతి రోజూ ఉదయం జంతుబలి జరుగుతుంది.
తారాపీఠ్, శక్తిపీఠం
P.C: You Tube
ఇక్కడ అమ్మవారిని కాళికామాత, భద్రకాళి, ఉగ్రకాళి అని పిలుస్తారు. ఈ దేవాలయానికి నాలుగు ప్రధాన ద్వారాలు ఉంటాయి. నల్లటి గ్రానైట్ రాయితో ఈ దేవాలయాన్ని నిర్మించారు.
తారాపీఠ్, శక్తిపీఠం
P.C: You Tube
ఇక్కడ అమ్మవారి విగ్రహం మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. కపాలమాలను హారంగా ధరించి ఉంటుంది. ఎర్రటి నాలుకను బయటకు చాచి, శిరోజాలు వదిలివేసి అమ్మవారు ఉంటారు.
తారాపీఠ్, శక్తిపీఠం
P.C: You Tube
ఇక్కడ అమ్మవారి నుదుటి కుంకుమను భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. భక్తులు రుద్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంతపరచడానికి టెంకాయి, అరటి పండు, చీరలతో పాటు ఒక్కొక్కసారి విస్కీని కూడా అమ్మవారికి నైవేద్యంగా అందజేస్తారు.
తారాపీఠ్, శక్తిపీఠం
P.C: You Tube
ఇక్కడ అమ్మవారు శివుడి ఎద పై కాలు ఉంచుకొని నిలబడి ఉంటుంది. అయితే భక్తులు కేవలం అమ్మవారి మొహం మాత్రం చూడటానికి వీలవుతుంది. పాత దేవాలయం పూర్తిగా ధ్వంసం అయిపోయింది.
తారాపీఠ్, శక్తిపీఠం
P.C: You Tube
దీంతో ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్న దేవాలయం క్రీస్తుశకం 1225లో జగన్నాథ్ రే నిర్మింపజేశాడు. ముఖ్యద్వారంలో దుర్గాదేవి రూపాలు చెక్కగా ఎడమవైపు ఉన్న ద్వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం చిత్రీకరించారు.
తారాపీఠ్, శక్తిపీఠం
P.C: You Tube
అదే కుడివైపున ఉన్న ద్వారం పై రామయణ కావ్యాన్ని అందంగా కూడా చిత్రీకరించారు. ఇక్కడ అమ్మవారి కనుగుడ్డు పడటం వల్ల ఈ దేవాలయం మిగిలిన శక్తిపీఠాలతో పోలిస్తే ఈ శక్తిపీఠానికి శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు.
తారాపీఠ్, శక్తిపీఠం
P.C: You Tube
అందువల్లే అఘోరాలు ఎక్కువగా ఈ దేవాలయానికి వస్తుంటారు. తాంత్రిక విద్యలను నేర్చుకొంటూ ఉంటారు. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అఘోరాలు రావడం ఎక్కువగా ఉంటుంది.
తారాపీఠ్, శక్తిపీఠం
P.C: You Tube
ఆ రోజుల్లో అమ్మవారికి శక్తి రెట్టింపవుతుందని నమ్ముతారు. ఆరోజున అమ్మవారిని పూజిస్తే కోరిన కోర్కెలు వెంటనే తీరుతాయని స్థానిక భక్తుల విశ్వాసం. అందువల్లే ఇక్కడకు అనేక మంది భకతులు వస్తుంటారు.