ప్రశాంతమైన వేసవి సెలవుల కోసం కర్ణాటకలోని సందర్శరనీయ ప్రదేశాలు
కర్ణాటక రాష్ట్రం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం. ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు, నిర్మలమైన హిల్ స్టేషన్లతో అపారమైన అందం ఈ రాష్ట్రం సొంతం. సాధారణంగా బెంగుళూరు, హంపి, వంటి కూర్గ్ పర్యాటకులు ఇక్కడ ఎక్కువగా సందర్శించే ప్రదేశాలు. అయితే, కర్నాటకలోని కొన్ని సీజనల్ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రశాంతమైన వేసవి సెలవుల పర్యటన కోసం కర్ణాటకలోని ఈ ఆరు అందమైన సందర్శనీయ ప్రదేశాలను చూడాల్సిందే.

గోకర్ణం
ప్రశాంతమైన విహారయాత్ర కోసం కర్ణాటకలోని గోకర్ణం వెళ్లవచ్చు. సమృద్ధిగా పచ్చదనంతో నిండిన ఈ ప్రదేశం ప్రశాంతతకు మారుపేరుగా చెబుతారు ఔత్సాహికులు. మీరు మీ వేసవి సెలవులను మరింత ఆనందంగా గడపాలనుకుంటే బీచ్లు మరియు రిసార్ట్లతో కూడిన ఈ అందమైన పట్టణానికి వెళ్లండి. ఇది దేశంలోని అత్యంత ప్రశంసలు పొందిన బీచ్లలో ఒకటి ఓం బీచ్. ఇది హిందూ ఆధ్యాత్మిక చిహ్నం ఆకారాన్ని పొంది ఉంటుంది. మీకు ఇష్టమైన పానీయాలు తాగుతూ, పారాసైలింగ్, స్నార్కెలింగ్ మరియు బనానా బోట్ రైడ్ల వంటి సాహస కార్యకలాపాలలో పాల్గొంటున్నప్పుడు మధురమైన సూర్యాస్తమయాన్ని చూడండి. గోకర్ణంలో కొన్ని పురాతన శివుడు, గణేశ దేవాలయాలు కూడా ఉన్నాయి.

మరవంతే
మరవంతే అనేది సుందరమైన కొడచాద్రి కొండలకు ఎదురుగా ఉన్న ప్రశాంతమైన తీరప్రాంత గ్రామం. ఈ బీచ్ ఒకవైపు అరేబియా సముద్రం మరియు మరోవైపు సౌపర్ణికా నదితో చక్కగా ఉంటుంది. సముద్రం, నది యొక్క ప్రత్యేకమైన కలయిక దీనిని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మార్చింది. పదుకొనే గ్రామం, కోడి బీచ్, మరవంతే, బిజాడి గ్రామం వంటి అనేక ప్రదేశాలతో ఇక్కడికి సందర్శకులను ఆహ్వానిస్తాయి. వారి స్థానిక రుచికరమైన వంటకాలను ఆస్వాదించడం మర్చిపోవద్దు.

జోగ్ జలపాతం
కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఉన్న జోగ్ ఫాల్స్ 488 మీటర్ల ఎత్తులో భారతదేశంలోనే ఎత్తైన జలపాతాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది దట్టమైన సతత హరిత అడవుల మధ్య ఉంది. ఈ వేసవిలోనూ ఇక్కడి జలపాతాలు మరింత దృశ్యమానంగా ఆకట్టుకుంటాయి. రెండు వ్యూపాయింట్లలో సందర్శకులు ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదించేందుకు అనుమతి ఉంటుంది. కయాకింగ్ మరియు కొరాకిల్ రైడింగ్ సమీపంలోని అడ్వెంచర్ క్యాంపులలో పాల్గొనడానికి కొన్ని కార్యకలాపాలు అందుబాటులో ఉంటాయి.

అగుంబే
దక్షిణ భారతదేశంలోని చిరపుంజీ అని కూడా పిలువబడే అగుంబే, పచ్చని అడవులు మరియు జలధారలతో నిండి ఉంది. ఇది అద్భుతమైన సూర్యాస్తమయాల కోసం ఫోటోగ్రాఫర్లకు అనువైన గమ్యస్థానంగా పేరుగాంచింది. ప్రకృతి ప్రేమికులకు కూడా అన్వేషించడానికి చాలా అందిస్తుంది. కూడ్లు తీర్థ జలపాతం, జోగిగుండి, బర్కానా జలపాతం, ఒనకే అబ్బి జలపాతాలు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి.

కుద్రేముఖ్
కుద్రేముఖ్ యొక్క ఆకట్టుకునే కొండ శ్రేణులు ప్రకృతి ప్రేమికులకు మరియు ట్రెక్కింగ్ ఔత్సాహికులకు స్వర్గధామం. గొప్ప జీవవైవిధ్యం, జలపాతాలు, పర్వతాలతో కూడిన ఈ ప్రదేశం గొప్ప వేసవి విహారయాత్రను అందిస్తుంది. కలసా టెంపుల్ టౌన్, కుద్రేముఖ్ పీక్, కుద్రేముఖ్ నేషనల్ పార్క్, హనుమాన్ గుండి జలపాతం మరియు లక్యా డ్యామ్ తప్పక సందర్శించవలసిన కొన్ని ఆకర్షణలు.

హొన్నెమర్దు
మీరు అడ్వెంచర్ ట్రిప్ కోసం చూస్తున్నట్లయితే, హొన్నెమర్దు మీ గమ్యస్థానంగా ఎంచుకోండి. ఈ చిన్న గ్రామం సందర్శకులకు టన్నుల కొద్దీ నీటి క్రీడలను అందిస్తుంది. ఇది శరావతి నది ఒడ్డున ఉన్నందున పక్షులను వీక్షించడం, ట్రెక్కింగ్ లేదా క్యాంపింగ్ కూడా చేయవచ్చు. హొన్నెమర్దు జోగ్ జలపాతం మరియు డబ్బే జలపాతాలకు సమీపంలో ఉంది.



Click it and Unblock the Notifications















