ప్రకృతి మానవుడికి ప్రసాదించిన బహుమతులలో జోగ్ జలపాతాలు ఒకటి. ఈ జలపాతం షరావతి నదినుండి ఏర్పడుతుంది. నాలుగు భాగాలుగా ప్రవహిస్తుంది. అవి రాజా, రాణి, రోవర్ మరియు రాకెట్ అని అంటారు.
స్వచ్ఛమైన నీటి జలపాతాలు - షుమారుగా 830 అడుగుల ఎత్తునుండి ఒంపు సొంపులతో క్రిందకు పడే ఈ జలపాతాలు వేలాది సందర్శకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. రమణీయమైన ఈ జలపాతాల అందం ఈ ప్రదేశానికి చుట్టుపట్ల గల పచ్చటి పరిసరాలతో మరింత అధికమవుతుంది. జోగ్ ఫాల్స్ అందాలను ఆనందించాలంటే అనేక ప్రదేశాలనుండి దానినిచూడవచ్చు.
అన్నిటికంటే మంచి ప్రదేశం అంటే వాట్కిన్స్ ప్లాట్ ఫారం. జలపాతం కిందకు చేరుకోవడం మరల వెనక్కు ఎక్కడం వంటివి ఎంతో కష్టంగా ఉంటాయి. ఈ రకమైన చర్యలు యాత్రికులు తమ కండరాలు బలం చేసుకోవాలంటే చేయాలి. జోగ్ ఫాల్స్ ప్రధాన పర్యాటక ఆకర్షణ అవటంతో రవాణా సౌకర్యాలు అధికంగానే ఉంటాయి. దీనికి సమీప పట్టణం అంటే షిమోగా జిల్లాలోని సగారా అని చెప్పాలి. సగారా మరియు జోగ్ ఫాల్స్ ప్రదేశానికి ఎన్నో బస్సులున్నాయి. కార్వార్ లేదా హేనోవర్ లనుండి కూడా బస్ లున్నాయి. వర్సాకాలంలో ఈ జలపాతాలు మరింత అందంగా ఉంటాయి. ఇతర ఆకర్షణలు అంటే అటవీ సందర్శన, స్వర్ణ నది మరియు షరావతి వ్యాలీ సందర్శన చేయవచ్చు.