మహారాష్ట్ర లోని పూణే జిల్లలో వున్న రెండు చిన్న గ్రామాలు తులాపూర్, వాధూ. శివాజీ మహారాజు కొడుకు శంభాజీ జీవితంలోని చివరి విలువైన క్షణాలతో అల్లుకున్న చరిత్ర ఈ రెండు గ్రామాలదీ.
ఈశాన్యంలో వుండే తులాపూర్ పూణే నుంచి 40 కిలోమీటర్ల దూరంలో వుంది. పూర్వం నగర్గావ్ గా పిలువబడిన ఈ వూరు బ్రహ్మ, భామా, ఇంద్రాయని అనే మూడు నదుల సంగమంలో వుంది.
మరో వంక, శంభాజీ మహారాజు, అతని మిత్రుడు, కవి కలష్ ల సమాధులకు నెలవు వాధూ.
వాటి చారిత్రిక ప్రాధాన్యం
నిజానికి ఈ రెండు ఊళ్ళూ చిన్నవైనా మరాఠా రాజ్యపు చరిత్ర పుటల్లో తులాపూర్ కి, వాదూకి ప్రముఖమైన పాత్ర వుంది.
ఇంతకు ముందే చెప్పినట్టుగా, ఛత్రపతి శంభాజీ తులాపూర్ లో చనిపోగా, వాధూ లో సమాధి చేయబడ్డాడు. అందువల్ల శివాజీ కొడుకు శంభాజీ స్మారకం వాధూలో ఏర్పాటు చేయబడింది. గంభీరంగా వుండే ఈ రెండు ఊళ్లూ చూసి తీరాల్సిందే.
సమాధే కాకుండా, 1822 నాటి ఒక యుద్ధ స్మారకం కూడా ఇక్కడ వుంది. రణస్తంభంగా పిలువబడే ఈ కట్టడాన్ని మరాఠా-బ్రిటిష్ యుద్ధంలో అసువులు బాసిన మరాఠా యోధుల స్మారకార్ధం నిర్మించారు.
ఈ జంట గ్రామాల్లో ఏమి చూడాలి.
తులాపూర్ లో సంగమేశ్వర దేవాలయం అనే శివాలయం వుంది. ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ శంభాజీ ని ఇక్కడే చంపేసాడు.ఈ దేవాలయం సాధారణంగా చాలా మంది యాత్రికులతో కిట కిట లాడుతుంది, పర్వదినాల్లో రద్దీ ఇంకా పెరుగుతుంది.
వాధూ, తులాపూర్ రెండూ చూసి తీరాల్సిన చారిత్రక ప్రదేశాలు. భారత దేశ ఉజ్వల చరిత్రలోకి తొంగి చూడ్డానికి ఈ రెండు గ్రామాలు సందర్శించండి.



Click it and Unblock the Notifications