ఆగ్రా - ఢిల్లీ 2 వ జాతీయ రహదారి పై సికంద్రాకు 12 కిలోమీటర్ల దూరంలో, ఆగ్రా కు 20 కిలోమీటర్ల దూరంలో కీతం సరస్సు ఉంది. నిర్మలమైన పరిసరాల మధ్య ఉన్న ఈ అందమైన జలవనరు వినోదానికి ఒక ఉత్తమ విహారయాత్ర స్థానమే కాక తీవ్రమైన పని ఒత్తిడి ఉండే నగర జీవితం నుండి ఉపశమనాన్ని కల్గిస్తుంది.
7.13 చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతంలో సేకరించిన నీటిలో స్థాపించిన పంచభుజి ఆకారంలోని కీతం సరస్సు దాని మనోజ్ఞతను, అందాన్ని ఇనుమడింప చేసే విస్తృత శ్రేణిలో ఉన్న నీటి పక్షులు, చేపలకు నివాసం.
సుర్ సరోవర్ పక్షుల అభయారణ్యం
కీతం సరస్సుకు దగ్గరగా ఉన్న అందమైన సుర్ సరోవర్ పక్షుల అభయారణ్యం సుమారు 100 జాతుల దేశీయ, వలస పక్షులకు, పన్నెండు జాతుల క్షీరదాలకు, 18 జాతుల సరీసృపాలకు నివాసం.
ఇక్కడ కనబడే కొన్ని ప్రధాన పక్షి జాతులలో సైబేరియన్ కొంగలు, బ్రాహ్మినీ బాతులు, కొంగలు, సారస్ కొంగలు, షో వెల్లర్లు, గాడ్ వాల్స్, పట్టి వంటి తల ఉన్న బాతులు ఉన్నాయి. ఇక్కడికి కీతం రైలు స్టేషన్ నుండి ఇక్కడికి చేరవచ్చు. యు పి అటవీ శాఖ వారు ఈ ప్రాంత మొత్తానికి 27 మార్చి 1991 లో జాతీయ పక్షుల అభయారణ్యం హోదాను కల్పించారు.



Click it and Unblock the Notifications