మరియం జమాని, అజ్మీర్ రాజు, బర్మల్ కచ్చవాహ యొక్క కుమార్తె. ఈమె మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ను వివాహమాడింది. ఈమె చాలా సంవత్సరాల తరువాత సలీం అనే పుత్రుడికి జన్మ ఇచ్చింది.ఆ సందర్భంలో గ్రేట్ అక్బర్ ఆమెకు మరియమ్ జమాని అని బిరుదు ఇచ్చాడు. మరియమ్ జమాని అంటే 'ప్రపంచానికి కరుణామయి' అని అర్థం. ఆమె కొడుకు, సలీం, తరువాత జహంగీరుగా పేరు పొందాడు.
మరియమ్ జమాని 1623 లో, ఆగ్రాలో, మరణించింది మరియు ఆమె కొడుకు జహంగీర్ ఆమె కొరకు ఒక సమాధి కట్టించాడు. ఇది సికంద్రలో ఉన్న అతని తండ్రి, అక్బర్, సమాధికి సమీపంలోనే ఉన్నది. ఈ సమాధి కట్టడానికి నాలుగు సంవత్సరాలు, అంటే 1623 నుండి 1627 వరకు పట్టింది.
తోటలో చదరపు ఆకారంలో ఉన్న సమాధి ఉన్నది. సమాధి మధ్యలో రెండు వసారాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. సమాధి పైకప్పుకు భారీ స్తంభాలను మద్దతుగా ఉంచి పెద్ద ఆర్చేస్ పై నిర్మించబడింది. ఇది ఇటుకలు, నానా వర్ణములుగల గాజురాళ్లు పొదిగి చేసిన గచ్చుపని మరియు ముతక సున్నముతో తయారు చేయబడింది. దీని నాలుగు మూలల్లో నాలుగు భారీ ఛత్త్రిస్ లేదా గొడుగులు ఉండి, నగలతో అలంకరించినట్లుగా ఉన్నాయి. ఈ 'గుమ్మటం లేని సమాధులు' మొఘల్ శైలి వాస్తుశిల్పచాతుర్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ.