ఝుల్తా మినార్ అంటే రెండు జతల కదిలే మినార్లు, సిద్ధి బషీర్ మాస్క్ లో సారంగపూర్ దర్వాజా కి ఎదురుగా ఒకటి, రాజ్ బీబీ మాస్క్ లో అహ్మెదాబాద్ రైల్వే స్టేషన్ కి ఎదురుగా ఇంకొకటి ఉన్నాయి. ఈ మినార్ల ప్రత్యేకత ఏంటంటే, ఒక మినార్ జాతని కదిపినప్పుడు కొన్ని సెకండ్లలో అవతల పక్కన ఉన్నటువంటి మినార్ జత కదులుతుంది. కాని, మధ్యలో ఉన్న మార్గం మాత్రం ఏమాత్రం ప్రభావితం కాదు. మూడు అంతస్తుల ఈ మినార్ సిద్ధి బషీర్ మాస్క్ లో ఉంది. ఈ మినార్ ని సిద్ది బషీర్ నిర్మించాడు. ఈయన సుల్తాన్ అహ్మద్ షా యొక్క్ సేవకుడు.
ఈ మినార్ల యొక్క రహస్యాన్ని కనుక్కోవడానికి బ్రిటిష్ వారు స్టేషన్ కి దగ్గరలో ఉన్నటువంటి మినార్ లో ని కొంత భాగాన్ని విడదీశారు. కాని దాన్ని తిరిగి పూర్వపు స్థితికి అనుసంధానించలేకపోయారు. ప్రస్తుతం, ఈ మినార్ల పైకి పర్యాటకులను అనుమతించపోయినప్పటికీ ఈ మినార్లు ఇప్పటికీ పర్యాటకుల ఆసక్తిని చూరగొంటున్నాయి.