సర్కేజ్ రోజా అనేది గుజరాత్ లో ని అతి ముఖ్యమైన రోజా సముదాయం. ఈ సముదాయం వివిధ మసీదులు, స్మశానాలు, పాలసు ల తో కలిపి తయారయింది. అహ్మెదాబద్ కి 7 కిలోమీటర్ల దూరం లో సర్కేజ్ లో ఉన్నటువంటి ఈ సముదాయం సుల్తాన్ మొహమ్మద్ షా చే నిర్మాణం మొదలుపెట్టబడి ఖుతుబుద్దిన్ అహ్మద్ షా చే కొనసాగింపబడి మహమ్మద్ బేగ్డా చే పూర్తి చేయబడింది. సుల్తాన్ మొహమ్మద్ షా, షేక్ అహ్మద్ ఖట్టు గంజ్ బక్ష్ అనబడే సూఫీ సన్యాసి మరణానంతరం ఒక మాస్క్ ఒక మౌసొలెమ్ ల ను అయన స్మృత్యర్ధం నిర్మించారు.
మహ్మద్ బేగ్డా ఈ కాంప్లెక్స్ ని ఒక సమ్మర్ పాలసు తో సెంట్రల్ ట్యాంక్ కిఅభివృద్ధి పనులతో కొన్ని మంటపాల నిర్మాణంతో ఒక వ్యక్తిగత చిన్న మసీదుతో తన, తన కుమారుడు మరియు రాణి యొక్క సమాధులతో విస్తరించాడు. ఇక్కడ ఇస్లామిక్ హైందవ మరియు జైనుల నిర్మాణ శైలిలో మేళవింపు కనబడుతుంది. డోమ్లు , స్తంభాలు , బ్రాకెట్ లు ఇస్లామిక్ శైలి లో అలంకరణ , నమూనాలు హైందవ శైలి లో ఉంటాయి. ఇక్కడి అనేక కట్టడాలు అర్చిలతో కాకుండా రాతి తో అనుసంధానించబడ్డాయి.