అహ్మెదాబాద్ లో 1573 లో నిర్మించబడిన ఈ మసీదు ఈ ప్రాంతం లో నిర్మించబడిన చివరి మసీదు. దీనిని మొఘలుల శకం లో నిర్మించారు. పడమర వైపు కిటికీల మీద కనిపించే రాతి జాలక పని లో కనిపించే అహ్మెదాబాద్ చిహ్నం వల్ల ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. రాతి తో సున్నితంగా చిత్రించబడిన వృక్షం యొక్క చిత్రలేఖనంలో ఈ నిర్మాణం యొక్క విశిష్టత కనిపిస్తుంది. రద్దీ గా ఉండే నగరం లో ఉన్నా ఈ మసీదు వర్ణనాతీతమైన అనుభూతిని కలిగిస్తుంది.