చిప్లున్ రత్నగిరి జిల్లాలో ఒక అందమైన పట్టణం. ఇది ముంబై - గోవా జాతీయ రహదారిపై కలదు ముంబై నుండి గోవా వెళ్ళే పర్యాటకులకు ఇది ఒక మద్యలో విశ్రాంతి ప్రదేశంగా ఉండేది. ఇపుడు ఇది ఒక పర్యాటకప్రదేశంగా తయారైంది. ఛిప్లూన్ పూనే మరియు కొల్హాపూర్ లకు సమీపంగా ఉంటుంది.
ఒక రహదారిలో ఉత్తర దక్షిణాలుగా విస్తరిస్తూ ఛిప్లూన్ పడమటి కనుమలలో తూర్పువైపు మరియు అరేబియా సముద్రానికి పడమటి భాగంలో కలదు. తీరం వెంట ఉండటం చేత ఇక్కడి వాతావరణం కొద్దిపాటి వెచ్చగాను మరియు సంవత్సరం అంతా చల్లగాను ఉంటుంది. ఇక్కడి వశిష్టి నది ఒడ్డున ఛిప్లూన్ కలదు. చుట్టు పక్కల ఉన్న కొండలమీద ట్రెక్కింగ్ మరియు నదిలో బోటింగ్ కూడా చేయవచ్చు.
అందమైన ప్రదేశంలో సుందరమైన బీచ్ ప్రాంతాలు
ప్రశాంతత కారణంగా ఇరుగు పొరుగు నగరాల పర్యాటకులు చిప్లూన్ పర్యటనకు ఇష్టపడతారు. నగర బిజీ జీవితాలనుండి ఇది ఎంతో వివ్రాంతినిస్తుంది. స్ధానిక ఆహారాలు మరియు గణపతి పూలే, కర్నేశ్వర్ దేవాలయం, గుహగర్ బీచ్ వంటివన్ని కలిసి ఈ చిన్న పట్టణాన్ని మరచిపోలేనిదిగా చేస్తాయి.
ఈ పట్టణంలో అక్షరాస్యత శాతం సుమారుగా 80కి పైగా కలదు. దానితో స్ధానికులు పర్యాటకులతో చాలా స్నేహపూరితంగా కూడా ఉంటారు. ఏ ప్రాంతం వారైనప్పటికి సంభాషించటం తేలిక. స్ధానికులకు పర్యాటకుల అభిరుచులు బాగా తెలుస్తాయి. కనుక మీరు మీ స్వంత గ్రామంగా కూడా భావిస్తారు.
చిప్లూన్ లో కోటలు
చిప్లూన్ అనే మాట పరశురాముడి స్వంతపట్టణం కారణంగా వచ్చింది. ఇక్కడ ప్రసిద్ధ దేవాలయాలు కలవు. 1670 లో శివాజీ మహారాజు నిర్మించిన గోవాల్ కోట ఫోర్ట్ లో ఫొటోగ్రాఫర్లు బిజీ బిజీగా తిరిగేస్తూ కనపడతారు. ఛిప్లూన్ పెద్ద పెద్ద నగరాల సమీపంలో ఉండటంతో ఆయా నగరాల ప్రజలు వారాంతపు సెలవులు అంటూ అక్కడకు వచ్చి ఆనందిస్తారు.



Click it and Unblock the Notifications