ఢిల్లీ మెట్రో ఒక ఆధునిక టెక్నాలజీని కలిగి ప్రజలకు తేలిక రవాణా సదుపాయాలు కలిగిస్తోంది. ఎల్లప్పుడూ బిజీ గా వుండే వీధులు మెట్రో రాకతో ఒక మాదిరి విశ్రాంతిని పొందుతున్నాయి. ప్రజలు తేలికగా, సౌకర్యవంతంగా ప్రయాణాలు చేస్తున్నారు.
ఢిల్లీ మెట్రో మార్గం 1998 లో మొదలైనప్పటికి, మొదటి రైల్వే లైన్ గా చెప్పబడే రెడ్ లైన్ సుమారు 2002 లో నిర్వహణ లోకి వచ్చింది. దీని తర్వాత వరుసగా, యెల్లో లైన్, బ్లూ లైన్, గ్రీన్ లైన్ మరియు వయొలెట్ లైన్ లు తెరువబడ్డాయి.
ఢిల్లీ మెట్రో ఎలా ఉపయోగించాలనేది ఎటువంటి చదువు లేని వారికైనా అర్ధం అయిపోతుంది. జర్నీ మొదట్లో, జర్నీ చివరిలో కార్డులను ఎలా రీ ఛార్జ్ చేసుకోవాలనేది ప్రయాణికులకు తేలికగా తెలుస్తుంది. ట్రైన్ కదలికల ప్రకటనలు హిందీ మరియు ఇంగ్లీష్ భాషల లో ప్రకటించ బడతాయి.
ప్రపంచ శ్రేణి స్థాయి లో కల ఈ ఢిల్లీ మెట్రో విధానం దాని ఆధునిక టెక్నాలజీ తో ప్రజలకు భద్రత, సౌలభ్యం కలిగిస్తోంది. ఎయిర్ కండిషన్ కోచ్ లు ఆటోమాటిక్ చెల్లింపు విధానం వంటివి ప్రయాణాన్ని సుఖవంతం చేస్తున్నాయి. ఎంట్రీ మరియు ఎగ్జిట్ లు తెరుచుకునే ద్వారా ల ద్వారా మరియు ప్రజల సౌకర్యం కొరకు ఇరువైపులా పెట్టబడిన ఎస్కలేటర్ లు సౌకర్యంగా వున్నాయి.
ఢిల్లీ మెట్రో సిస్టం దేశం లోనే ప్రసిద్ధి గాంచినది. మీరు కనుక దేశ రాజధానిని సందర్శించినట్లయితే, ఢిల్లీ మెట్రో పని థేరును౮ వాస్తవ రీతిలో అనుభవించి ఆనందించవచ్చు.