ఫతేపురి మసీదు చందిని చౌక్ కి పడమటి అంచున ఉంది. ఈ మసీదు 1650 లో షాజహాన్ భార్యలలో ఒకరైన ఫతేపురి బేగం నిర్మించారు.
ఈ మసీదు ఎర్రని ఇసుకరాయితో నిర్మించబడింది. డిల్లీ మొత్తంలో మసీదుల సమూహంలో ఏకైక గోపురం ఉన్న మసీదు ఇది. ఈ మసీదు బైటనుండి చాలా చిన్నదిగా కనిపిస్తుంది, అయినప్పటికీ మీరు ఒకసారి ప్రవేశి౦చినట్లయితే అది చాలా పెద్ద నిర్మాణం.
ఈ మసీదు సాంప్రదాయ నమూనాలో తయారుచేయబడి, ప్రార్ధన మందిరం ఏడు ఆర్చిలతో ప్రారంభించబడి ఉంటుంది. ఈ ఏడు ఆర్చిలలో మధ్య ఆర్చ్ అతి పెద్దది. ఈ మసీదుకి రెండువైపులా ఒక అంతస్తు, రెండు అంతస్తుల నిర్మాణాలు ఉన్నాయి.
ఈ మసీదుకి మూడు ద్వారాలు ఉన్నాయి. ఎర్ర కోట ముందు ఒక ద్వారం, మిగిలిన రెండు ద్వారాలూ మసీదుకి ఉత్తర, దక్షిణల వైపు ఉన్నాయి. ఇస్లాం ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ జుహా రెండు పండుగలను ఎంతో వైభవ౦గా ఈ మసీదు వద్ద జరుపుకుంటారు.
ఎర్ర కోట, జమ మసీదు ఫతేపురి మసీదుకి సమీపంలో ఉన్న ఆకర్షణలు. ఇక్కడి పరిసర ప్రాంతంలో ఆసియా లోనే అతిపెద్ద స్పైస్ మార్కెట్, ఖారి బావోలి కూడా ఉన్నాయి.