ఏనుగుల శిబిరం గురువాయురప్పన్ దేవాలయంకి సుమారు ౩ కి.మీ. దూరంలో పున్నతుర్ కొట్టలో కలదు. ఈ ఏనుగుల శిబిరం ఇండియాలోనే అతి పెద్దది. ఇది పున్నత్తూరు రాజులకు చెందినది. ఈ శిబిరం సుమారు పది ఎకరాలలో వుంది సుమారు 60 ఏనుగులకు ఆశ్రయం ఇస్తోంది. ఈ శిబిరం లోని ఏనుగులు గురువాయురప్పన్ దేవాలయంకు భక్తులచే ఇవ్వబడ్డాయి .ప్రసిద్ధిచెందిన గురువాయుర్ పద్మనాభన్ మరియు గురువాయుర్ కేసవన్ లు ఈ శిబిరానికి చెందినవే. ఇవి అధిక సంఖ్యలో జనాలను ఆకర్షిస్తాయి. దేవాలయ పండుగలలో మరియు ఊరేగింపులలో దేవతలను మోస్తాయి. అంతేకాకఈ ఏనుగులు దేవాలయం నిర్వహించే పందేలలో పాల్గొంటాయి. రేసులో గెలిచిన ఏనుగును గురువాయురప్పన్ విగ్రహాన్ని మోయటానికి వినియోగిస్తారు.



Click it and Unblock the Notifications