గల్తాజి, జైపూర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధార్మిక ప్రదేశం. గల్తాజీ ప్రాంగణంలో దేవాలయాలు, మంటపాలూ, సహజ నీటిబుగ్గలు ఉన్నాయి. ఈ స్థలం కొండ భూభాగాల మధ్య ఉంది. ఈ ఆలయంలో సూర్య దేవుడు ఉన్నాడు. దివాన్ క్రిపారాం నిర్మించిన ఈ ఎత్తైన శిఖరాన్ని నగరంలోని ప్రతి భాగంనుండి చూడవచ్చు. గులాబీరంగు ఇసుకరాళ్ళతో నిర్మించిన ఈ దేవాలయం గోడలు అందమైన చిత్రాలతో, చెక్కుళ్ళతో అలంకరించబడి ఉన్నాయి.