జమ్మూ ను మరో పేరుగా దుగ్గర్ దేశ్ అని చెపుతారు. ఇది ఇండియా లో గొప్ప పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందినది. చలికాలాల లో జమ్మూ ప్రాంతం జమ్మూ & కాశ్మీర్ కు అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా పని చేస్తుంది. దీనికి కారణం శ్రీనగర్ లో ఆ సమయంలో విపరీతమైన మంచు కురియటమే. ఈ ప్రాంతం పేరు దానిని సుమారు క్రి. పూ. 8 వ శతాబ్దం లో కనుగొనిన రాజు జంబు లోచన్ పేరు పై పెట్టబడింది.
జమ్మూ ప్రాంతం లో కల అనేక దేవాలయాలు జమ్మూ పట్టణానికి సిటీ అఫ్ టెంపుల్స్ గా పేరు తెచ్చాయి. ఎంతో ప్రసిద్ధి చెందిన వైష్ణో దేవి టెంపుల్ ఇక్కడ వుండటం తో ఈ ప్రాంతం ఒక యాత్రాస్థలం గా కూడా పేరు పడింది.
అయితే, పర్యాటకులు, లేదా యాత్రికులు ఇక్కడి పుణ్య క్షేత్రాలకే కాదు, ఈ ప్రాంతాల లోని సుందర ప్రదేశాలు చూడటానికి కూడా వస్తారు. జమ్మూ ఘనతవహించిన హిమాలయ పర్వత శ్రేణులకు దక్షినంగాను, పంజాబ్ ప్రాంతానికి ఉత్తరంగాను కలదు. క్రింది ప్రాంతాలు దట్టమైన ఓక్ మరియు చెస్ట్ నట్స్ చెట్ల అడవుల తో వుంటే, ఉత్తరంగా, పై భాగాలకు వెళుతున్న కొలది అక్కడి ప్రాంతాలు దేవదారు, పైన్ చెట్ల ను కలిగి వుంటాయి.
జమ్మూ ని సందర్శించే పర్యాటకులు వైష్ణో దేవి టెంపుల్ , రఘునాథ్ టెంపుల్, ముబారక్ మండి పాలస్, మానసార్ లేక్, బహు ఫోర్ట్, అమర్ మహల్ వంటివి తప్పక చూడాలి. వైష్ణో దేవి టెంపుల్ లో వైష్ణో దేవి అమ్మవారు వుంటుంది. ఇది ఒక గుహ ఆలయం. ఈ దేవాలయ ప్రధాన ఆకర్షణ అంటే ఇక్కడ కల వైష్ణో దేవి మూడు రూపాలు ...అవి మహాకాళి, అంటే హిందువుల జనన , మరణాలు, మహాసరస్వతి అంటే హిందువుల కు జ్ఞానాన్ని ఇచ్చే దేవత, మూడవది మహాలక్ష్మి, అంటే ఐశ్వర్యం , అదృష్టం ఇచ్చే దేవత గా వుంటుంది.
రఘునాథ్ టెంపుల్ ను పూర్వం లో జమ్మూ రాజులైన మహారాజ రణబీర్ సింగ్ , ఆయన తండ్రి మహారాజ గులాబ్ సింగ్ లు నిర్మించారు. ఈ ప్రాంతం లో ఇది మరొక ప్రధాన ఆకర్షణ. నిర్మాణ తీరు, ఆర్చీలు, దేవాలయ గోపురాలు అన్నీ మొఘల్ శిల్ప శైలి కలిగి వుంటాయి.
జమ్మూ వెళ్ళేవారు, ముబారక్ మండి పాలస్ కూడా చూడాలి. ఇది డోగ్రా రాజుల రాజ నివాసం. ఈ భవన ప్రత్యేకత అంటే నిర్మాణం లో రాజస్థాని, మొఘల్, బరోకే, మరియు యూరప్ శిల్ప శైలి కనపడుతుంది. టెంపుల్ కాంప్లెక్స్ లోపలి షీష్ మహల్ ముబారక్ మండి పాలస్ కు ప్రధాన ఆకర్షణ
మానసార్ లేక్ ను మానస సరోవర్ లేదా పవిత్ర సరస్సు గా చెపుతారు. జమ్మూ లో ఇది ప్రసిద్ధిచెందిన ఆకర్షణ. చుట్టూ పచ్చని అడవులతో నది ఒడ్డున కల , ఈ గుడి లో హిందువుల నాగ దైవం శేష నాగ్ వుంటుంది.
బహు కోట, జమ్మూ లో చాలా పురాతన మైనది. దీనిని సూర్య వంశీకుడైన రాజా బాహు లోచన్ సుమారు 300 సంవత్సరాల కిందట నిర్మించారు. ఈ కోట చుట్టూ బాఘ్ ఎ బహు పేరు తో పచ్చటి తోటలు వుంటాయి. బాహు ఫోర్ట్ లీ పర్యాటకులు హిందూ దేవత కాళి రూపమైన బవే వాలి మాత టెంపుల్ కూడా చూడవచ్చు.
ఇంకా ఇక్కడ పీర్ బాబా దర్గః, సూరిన్సార్ లేక్, పీర్ ఖో గుహ ఆలయం, జిరాట్ పీర్ మిట్టా , నందిని వైల్డ్ లైఫ్ సంక్చురి వంటివి కూడా చూడవచ్చు. పర్యాటకులు ఈ ప్రదేశానికి వాయు, రైలు, లేదా రోడ్ మార్గం లో చేరవచ్చు. జమ్మూ విమానాశ్రయం సమీప స్థానిక విమానాశ్రయం గా వుంది. దేశం లోని ప్రధాన నగరాలకు అనుసంధానించబడింది.
జమ్మూ తావి రైలు స్టేషన్ సమీప రైలు స్టేషన్ . ఇది దేశం లోని అన్ని ప్రధాన రైలు స్టేషన్ లకు అంటే, పూణే, చెన్నై, న్యూ ఢిల్లీ వంటి నగరాలకు కలుపబడి వుంది. రోడ్ పై ప్రయానిం చాలానుకునేవారు అందుబాటులో కల ప్రైవేటు బస్సు లు లేదా టాక్సీ ల లో న్యూ ఢిల్లీ నగరం, అంబాల, అమ్రిత్ సర్,లూధియానా , షిమ్లా, మనాలి ల నుండి చేరవచ్చు.
జమ్మూ పర్యటించా లనుకునేవారు వాతావరణం ఆహ్లాదంగా వుండే సమయం అక్టోబర్ నుండి మార్చ్ వరకు పర్యటించ వచ్చు.