ఉమైద్ భవన్ మందిరం ప్రదర్శనశాలలో జోధ్పూర్ రాజ కుటుంబాలు ఉపయోగించిన వస్తువులను విస్తృతంగా ప్రదర్శిస్తున్నారు. ఈ మ్యూజియంలో విమానాల నమూనాలు, ఆయుధాలు, పాత గడియారాలు, బాబ్ గడియారాలు, మట్టిపాత్రలు, కత్తులు, రాళ్ళు, చిత్రాలు, వేట విజయ చిహ్నాలు ఉన్నాయి. ఈ పురాతన వస్తువుల అరుదైన సేకరణ జోధ్పూర్ రాచరిక గొప్పతనాన్ని తెలియచేస్తుంది. ఈ మ్యూజియం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది.