ఖజురహో పర్యటనలో జవారి దేవాలయం చాలా ఆకర్షనీయమైనది. ఇది బ్రహ్మ దేవాలయానికి దగ్గరలో ఉన్నది మరియు ఖజురహో తూర్పు దేవాలయాల్లో ఇది ఒకటి. ఇది ఇతర దేవాలయాలతో చూస్తే చాలా చిన్నది. ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది.
క్రి.శ. 1075-1100 మధ్యకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇది పురాతన ఖజురహో ఆర్కిటేక్చరల్ శైలికి ప్రతీకగా నిలిచింది. ఈ ఆలయం 11.88 మీ. పొడవు మరియు 6.4 మీ. వెడల్పు కలిగి ఉన్నది. ఆలయ గోడలు అందమైన శిల్పనైపుణ్యంతో, వాటి వివరాలతో అందంగా అలంకరించి ఉన్నాయి.
ఈ ఆలయ నిర్మాణంలో ప్రవేశద్వారానికి ఒక ప్రత్యేకత ఉన్నది. విస్తృతమైన ప్రవేశద్వారం సరిగ్గా భారీ చెక్కిన టవర్లకు సమతుల్యంగా ఉన్నది. ఖజురహో పురాతన నిర్మాణశైలిని చూడాలంటే ఈ ఆలయాన్ని పర్యాటకులు దర్శించి తీరవలసిందే!