లక్ష్మణ ఆలయం విష్ణుమూర్తి గౌరవార్ధం ఏర్పాటుచేయబడిన ఆలయం. ఇది రాతితో నిర్మించబడిన ఒక అద్భుతమైన నిర్మాణం. ఇది పడమర కోనకి చెందిన అత్యంత పురాతన ఆలయాలలో ఒకటి. ఇది క్రీశ 930 – 950 లో నిర్మించబడింది. ఇది గడ్డు పరిస్థితులలో నిలబడి, దాని నిర్మాణాన్ని కాపాడుకున్న ఆలయాలలో ఒకటి.
ఈ ఆలయంలో హిందూ దేవతల 600 కంటే ఎక్కువ చిత్రాలు ఉన్నాయి. ఈ ఆలయ వేదికపై గుర్రాలు, ఏనుగులకు చెందిన అనేక చిత్రాలు ఉన్నాయి. ఈ ఆలయ నాలుగు మూలలా నలుగు చిన్న ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి సరిహద్దుగా కంచె వేయబడిఉంది.
ఈ ఆలయంలో శ్రామికుల నైపుణ్యం, అందమైన చేతిపనితనం వివిధ చిత్రాల రూపంలో కనిపిస్తాయి. ఈ ఆలయంలో ఆభరణాలు ధరించి, వివిధ భంగిమలలో నిలబడిన అనేకమంది స్త్రీల చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ అలంకరించబడిన స్త్రీల బొమ్మలు ఆలయానికి పడమర వైపు ఉన్నాయి.