ఖజురహో పశ్చిమ దేవాలయాలలో ఈ ఆలయం చాలా పెద్దది. సాధారణ వేదిక మీద నిర్మించిన మొట్టమొదటి ఆలయం. దీనిని 1025-1050లో చందేల పరిపాలకులు కట్టించారు. ఈ ఆలయాన్ని శివుడిని ఆరాధించి,పూజలు జరపటానికి కట్టించారు. గర్భ గృహం మధ్యభాగంలో ఒక శివలింగం ఉన్నది.
ఈ ఆలయం గర్భ గృహ, అర్థమండప, ప్రదక్షిణలు మరియు మహామండప అనే ఐదు భాగాల నిర్మాణ శైలి లో రూపొందించబడింది. ఈ ఆలయగోపురం 100 మీ. పైన ఎత్తు కలిగి ఉన్నది. ఆలయ ప్రధాన విభాగం చెక్కిన మరియు రూపకల్పన అనేక చిత్రాలతో అలంకరించబడి, కళాకారుని గొప్ప శిల్పనైపున్యానికి ఉదాహరణగా నిలిచి ఉన్నది.
ఈ ఆలయం లోపలిభాగంలో ప్రత్యేకంగా రూపొందించిన సున్నితమైన నమూనాల తోరణాలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయ గోడలపైన దేవుళ్ళు, దేవతలు మరియు శృంగార భంగిమలో ఉన్న జంటల శిల్పాలతో చెక్కారు.