ఈ ఆలయం ఖజురహోలో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయ గర్భ గ్రహం, యూనివర్స్ యొక్క దేవత, దేవి జగదంబకు అంకితం చేయబడింది. ఈ ఆలయ గోడలు అందంగా, చాతుర్యంతో చెక్కబడిన శిల్పాలను కలిగి ఉన్నాయి. ఈ ఆలయాన్ని మొట్టమొదట విష్ణువుకు, తరువాత పార్వతికి మరియు కాళి దేవతకు అంకితం చేశారని ఒక నమ్మకం. ఈ దేవాలయము ఒక అద్భుతమైన ప్రాతినిథ్యంగల మూడు భాగాల రూపకల్పనతో ఉన్నది. దీని రూపకల్పనకు, చిత్రగుప్త దేవాలయానికి పోలిక ఉన్నది. ఈ ఆలయం నడవటానికి కూడా స్థలం లేనంతగా గర్భగుడి మీద ఉన్నది.
ఈ ఆలయ గోడల మీద ఉన్న అందమైన, నిపుణతతో కూడిన శిల్పకళను చూసి పర్యాటకులు సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోతున్నారు. ప్రతి రాతి చెక్కడం దర్శకులకు ఒక కథను వినిపిస్తుంది.ఇటువంటి అరుదైన నిర్మాణ రూపకల్పన మరియు శిల్పకళ ఎక్కడ చూడబోము. ఈ దేవాలయాన్ని దర్శించకుండా ఖజురహో పర్యటన పూర్తి కాదు.