మతన్గేశ్వర్ ఆలయం హిందూ మతం దేవుడైన పరమశివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో ఒక అద్భుతమైన మరియు ఎనిమిది అడుగుల ఎత్తైన భారీ శివలింగం ఉంది. మహాశివరాత్రి వార్షిక పండుగ సమయంలో ఈ ఆలయంనకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ లింగంను దేశం ఉత్తర భాగంలో గుర్తించవచ్చు. ఇది అతిపెద్ద లింగములలో ఒకటిగా ప్రత్యేకతను సంతరించుకుంది.
లింగంను పసుపు ఇసుకరాయితో తయారు చేస్తారు. ఇసుకరాయి లింగం ఒక ఆకర్షణీయమైన వెలుగు ఇవ్వడానికి మెరుగు చేస్తారు. ఈ పురాతన ఆలయం ఖజురహో వద్ద నిర్మించిన మొట్టమొదటి ఆలయంగా పేరు గాంచింది. భక్తులు ఈ ఆలయంను ఖజురహోలో పవిత్రమైన దేవాలయంగా పరిగణిస్తున్నారు.
ఈ ఆలయం లక్ష్మణ దేవాలయం సమీపంలో ఉంటుంది. కానీ దాని లోపలకు వెళ్ళటాన్ని నిరోధించేందుకు కంచె ఉంది. భక్తులు క్రమం తప్పకుండా ఈ ఆలయంనకు వస్తారు. ఈ ఆలయ రూపకల్పన ఇతర ఆలయాలతో పోలిస్తే సాదారణంగా ఉంటుంది.