తిరువళ్ళం పరశురామ స్వామీ ఆలయం కోవలం సమీపంలో కారమానా నది ఒడ్డున ఉంది. కేరళ లోని ఈ ఒక్క ఆలయంలో మాత్రమె పరశురాముని విగ్రహం ఉంది. ఈ ఆలయం కోవలం నుంచి, త్రివేండ్రం విమానాశ్రయం నుంచి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం కేరళను రూపొందించిన పరశురాముడికి నివాళిగా నిర్మించారని నమ్ముతారు. ఇది ఆయన భక్తులకు ప్రసిద్ధ ఆలయం, ప్రతి ఏటా అనేకమంది భక్తులు పూజలు నిర్వహించడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇపుడు కేరళ పురావస్తు పరిశోధనా శాఖకు చెందిన ఈ వారసత్వ భవనం, పన్నెండు, పదమూడవ శతాబ్దంలో నిర్మించారని చరిత్రకారుల నమ్మకం. పూర్వీకుల కోసం ఇచ్చే కానుకలు అంటే బలితర్పణం కోసం చాలామంది ఈ ఆలయానికి వస్తారు. ఈ ఆచారాన్ని ముఖ్యంగా కరమానా నది పవిత్ర జలంలో స్నానం చేసిన తరువాత ‘కర్కిడకా వావు’ రోజు జరుపుకు౦టారు.