బియాస్ నది ఒడ్డున మనాలీ కి దగ్గరలో ఉన్న ప్రసిద్ధ తీర్థ క్షేత్రం బిజ్లి మహాదేవ ఆలయం. శివుని కోసం నిర్మించిన ఈ ఆలయం సముద్ర మట్టానికి 2450 అడుగున ఎత్తున ఉంది. ఉత్తరభారతం లో హిమాలయాల వెంట నివసించే వారిని సాధారణంగా పహడీలు అని పిలుస్తారు, ఆ పహాడీల నిర్మాణ శైలిలో ఉన్న ఈ ఆలయంలో ఉన్న 60 అడుగుల ధ్వజస్తంభం బాగా ప్రసిద్ది పొందింది.
శివునికి ప్రతిరూపంగా భావించే శివలింగం ఒకప్పుడు వచ్చిన మెరుపువల్ల ముక్కలైపోయింది. తరువాత, ఆలయ పూజారులు శిధిలమైన శివలింగ౦ శకలాలను వెన్నతో అతికించారు. ఈ శివలింగ శకలాలని అతికించే ఉత్సవాన్ని ప్రతిఏటా నిర్వహిస్తారు. ఈ ఆలయానికి వెళ్లాలనుకునే యాత్రీకులు ఇరువైపులా పైన్ వృక్షాలు ఉండే ఒక కొండ మార్గం గుండా చేరుకోవాలి. ఈ గుడినుండి అందమైన పార్వతి లోయను, కులు లోయ దృశ్యాలను చూడవచ్చు.