విష్ణువు సోదరి భువనేశ్వరి కోసం నిర్మించిన జగన్నాధ దేవి ఆలయం కులు లోని బెఖ్లి లో ప్రసిద్ధ పర్యాటక క్షేత్రం. స్థానికుల నమ్మకం ప్రకారం ఈ ఆలయాన్ని 1500 ఏళ్ల నాడు నిర్మించారు. సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తున ఉన్న ఈ దేవాలయాన్ని సందర్శించడానికి 90 నిమిషాల పాటు కొండను ఎక్కడం ద్వారా చేరుకోవచ్చు.
జగన్నాధ దేవి ఆలయ గోడలపై దుర్గామాత, హిందూ మత స్త్రీ శక్తి స్వరూపాల చిత్రాలు అలంకరించబడి ఉంటాయి. ఈ ఆలయంలో విగ్రహం గద్ది, రాజస్థానీ గిరిజన శైలుల హస్తకళా నైపుణ్యాలను కనపరుస్తుంది. ఒక గొర్రెలకాపరి మంత్రపు వేణువు కు ఇద్దరు అమ్మాయిలు నృత్యం చేయడం కనుగొన్నాడని జానపద కధల వ్యాఖ్యానం. ఈ కధ ప్రకారం, ఆ అబ్బాయి ఇద్దరు అమ్మాయిలలో ఒకరిని పట్టుకోగా ఆమె దేవత అనే విషయం బయట పడింది. అప్పటి నుండి, ఆ దేవత బేఖ్లి గ్రామంలో నివశించాలని నిర్ణయించుకుంది.