బియాస్ నది మీద 76 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ పండో డామ్ జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కులు, మనాలీ లు ఈ డామ్ నుండి పెద్ద మొత్తంలో విద్యుత్ సరఫరాను అందుకుంటాయి. కులు నుండి మనాలీ వచ్చే మార్గంలో పర్యాటకులు ఆ ప్రాంత సౌందర్యానికి నిలిచిపోయి, ఆనందించడానికి ఈ డామ్ ఒక ప్రదేశంగా ఉంది. ఈ డామ్ అభివృద్ది, నిర్వహణలకు భాక్రా బియాస్ నిర్వహణా సంస్థ బాధ్యత వహిస్తుంది.