రఘునాథ్ దేవాలయం మనాలి లో శ్రీరాముడి కోసం నిర్మించిన ప్రధాన ధార్మిక క్షేత్రం. ఇక్కడి విగ్రహం ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య లోన వున్న త్రేత్ నాథ్ దేవాలయం నుంచి తెచ్చారని చెప్తారు. స్థానికుల విశ్వాసం ప్రకారం ఈ విగ్రహాన్ని శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారం శ్రీ రాముడు వాడారు. 1650 లో నిర్మించిన ఈ దేవాలయం పిరమిడ్, పహాడీ నిర్మాణ శైలుల మిశ్రమం – పహాడీ అనేది ఉత్తర భారతం లోని హిమాలయాల అంచున నివసించే ప్రజలను సూచించడానికి వాడే సాధారణం పదం.
ఈ క్షేత్రం లోని ప్రధాన దైవమే ఈ లోయను సంరక్షిస్తుంటాడని స్థానికుల విశ్వాసం. ఒక ఇతిహాసం ప్రకారం, రాజా జగత్ సింగ్ తన పూర్వ పాపాల నుంచి విముక్తుడు అయ్యేందుకు నిర్మించాడు.