పేరు లో సూచించినట్లుగానే ఈ గుడి సాయి బాబా కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఇది నోయిడా లో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి. ఈ దేవాలయం అత్యంత రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా వారాంతాల్లో. సాయిబాబా ఆశీర్వాదం ఆరోగ్యం, ఐశ్వర్యాన్నే కాకుండా సంతోషాన్ని,నయం కాని వ్యాధులని కూడా నయం చేస్తుంది అన్న భక్తుల నమ్మకమే దేవాలయ రద్దీకి కారణం.
ఈ దేవాలయాన్ని అందమైన మార్బుల్ తో నిర్మించారు. నిపుణుల పర్య వేక్షణలో రోజూ దాదాపు 100 మంది రోగులని చూసే ధర్మాసుపత్రి కూడా ఈ గుడిలో ఉంది. ఇంకా ఈ గుడి మధ్యాహ్నంపూట పేద పిల్లలకి ఉచిత భోజన వసతిని కల్పిస్తుంది.
ఈ ఆవరణలో చేసే నిత్య పూజలు, అర్చన,హోమాల వల్ల భక్తులు మానసిక ప్రశాంతతని పొందుతుంటారు. సాయి బాబా మందిర్ సమితి ఈ సాయి బాబా గుడి ని నిర్వహిస్తుంది. ఈ సమితి ఆధ్వర్యంలో దేశమంతటా అనేక సాయి దేవాలయాలు నిర్వహించబడుతున్నాయి.