నుహ్ నగరం, ఢిల్లీ,ఆల్వార్ జాతీయరహదారిపై, హర్యానా లోని మేవట్ జిల్లలో ఉంది. పొరుగు గ్రామాలనుంచి తయారుచేసే ఉప్పు వ్యాపారం వల్ల ఘసేర బహదూర్ సింగ్ సమయంలో ఈ పట్టణం ప్రాధాన్యతను సంతరించుకుంది. నుహ్ చుట్టూ 14 వ శతాబ్దం కిందటి అనేక చారిత్రిక శిధిలాలు ఉన్నాయి. ఘసేర బహదూర్ సింగ్ పాలనలో, ఈ పట్టణం ఉప్పు కి ప్రధాన వర్తక కేంద్రంగా ఉంది.
నుహ్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు ధార్మిక ప్రదేశాలతోపాటు పురాతన భూములు కూడా ఈ ప్రాంత ప్రధాన ఆకర్షణలు. నుహ్ ప్రధాన ఆకర్షణలలో ఒకటైన కదిలే మినార్లు పురాతన ఇంజనీరింగ్ కి మంచి ఉదాహరణ. అందమైన పూల చేక్కుళ్ళతో ఉన్న చూయి మై పాండ్ లేదా టాంక్ గొడుగుతో ఎర్రని ఇసుకరాయి సాక్ష్యంగా ఉంది. ఆరావళి కొండల కింద నుహ్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో నల్లాద్ అనే గ్రామంలో ఒక సహజ జలాశయం ఉంది.
అత్యంత ఆశక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ జలాశయంలో ప్రవహించే నీరు ఆరావళి పర్వతాల రాళ్ళ నుండి వస్తుంది. ఈ జిల్లాలో హిందూ మైనారిటీ కోసం ధార్మిక ప్రాముఖ్యత కలిగిన శివుని గుడి కూడా ఉంది. పాండవులు 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఇక్కడ ఉండి ఈ నీటిని తాగేవారని చెప్తారు.
నుహ్ సందర్శనకు సరైన సమయం సెప్టెంబర్, నవంబర్ మధ్య ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం.
నుహ్ చేరుకోవడం ఎలా నుహ్ రైలు, రోడ్డు మార్గాల ద్వారా రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది, ఈ పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్గాన్ సమీప రైల్వే కేంద్రం.