భిందవాస్ సరస్సు వారాంతపు విహారయాత్రకు, పక్షిప్రియులకు, ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు ఒక ఉత్తమ గమ్యస్థానం. హర్యానా రాష్ట్రంలో అతి పెద్ద చిత్తడిభూమిగా ఈ సరస్సును పరిగణిస్తారు. ఈ సరస్సు 12 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది.
దీనిని 1985 వ సంవత్సరం వన్యప్రాణి అభయారణ్యంగా ప్రకటించారు. భిందవాస్ సరస్సు వాస్తవానికి మానవ నిర్మిత సరస్సు. విద్యుత్ సమస్య కారణంగా జవహర్ లాల్ నెహ్రు కాలువ నుండి తోడలేకపోయిన అదనపు నీటిని నిలవ చేసేందుకు దీనిని నిర్మించారు. ఈ సరస్సు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి వేల సంఖ్యలో వలస పక్షులను ఆకర్షిస్తుంది. అవి తమ శీతాకాలపు నివాసాలను వదిలి, సౌకర్యంగా ఉండే వాతావరణంలో ఎక్కువ సమయం గడపడానికి ఇక్కడకు వస్తాయి.
వాటి పూర్తి సంఖ్య, వైవిధ్యం భారీ సంఖ్యలో పక్షి ప్రేమికులను ఈ సరస్సు వద్దకు ఆకర్షిస్తుంది. కింగ్ఫిషర్లు, నెమళ్ళు, బుల్ బుల్, సాధారణ కూకుడుగువ్వ, గ్రేటర్ నీటికాకులు, ఊదా చిత్తడి కోళ్ళు, ఇతర అనేక రకాల పక్షులు ఎగురుతూ వింత ధ్వనులను సృష్టిస్తాయి. సరస్సులో మెరిసే నీటి మట్టం చూసే వారికి కనువిందును కల్గిస్తుంది.
అక్కడి నీటిలో తేలియాడి, ఎగిరిన తర్వాత ఈ సరస్సులో ఉన్న అనేక చిన్న ద్వీపాలలో పక్షులు సేద తీరుతాయి. ఈ సరస్సు విస్తీర్ణం కూడా ఎక్కువగా ఉండటం వలన సాధారణ కెమెరాలకు చిక్కదు.