రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లా లో గల భాన్ గర్ పట్టణం నందు మధ్య యుగానికి చెందిన భాన్ గర్ కోట ఉంది. అంబర్ కు చెందిన గొప్ప మొగల్ సేనాని మాన్ సింగ్ కుమారుడు మాదో సింగ్ 1613 లో ఈ కోటను నిర్మించాడు. ప్రస్తుతం శిధిలావస్థలో వున్న ఈ కోట చుట్టూ పాక్షికంగా శిధిలమైన గోడ ఉంది. ఈ కోట ప్రాంగణంలో సహజసిద్ధ జలపాతాలు, తోటలు, సెలయేళ్లు, అంతఃపురాలు, మర్రి చెట్లు ఉన్నాయి. ఇక్కడ సోమేశ్వర, గోపీనాథ, మంగళదేవి, కేశవ రాయ్ దేవతల ఆలయాలు ఉన్నాయి.
ఇక్కడ ఒక కొండ గొడుగులా ఉండి మిగిలిన ప్రాంతాల నుండి వేరు గా ఏకాంతంగా ఉంటుంది. అనేక శతాబ్దాలనుండి భాన్ గర్ పట్టణం లోను, కోటలోనూ దెయ్యాలు సంచరిస్తున్నాయని ప్రజలు విశ్వసిస్తారు. తన తాత గారు మాదో సింగ్ కు బాబా బాలనాథ్ అనే యోగికి మధ్య జరిగిన ఒప్పందాన్ని అజబ్ సింగ్ ఉల్లంఘించినందు వల్ల భాన్ గర్ కోటను ఆ సాధువు శపించాడని ఇతిహాసాల వలన తెలుస్తుంది. దెయ్యాలు సంచరిస్తున్నoదువల్ల కోట నిర్మించిన వెంటనే దీనిని విడిచిపెట్టారని, ఈ పట్టణం కూడ నిర్మానుష్యమయ్యిందని ప్రజలు విశ్వసిస్తారు.ఆర్కియాలజీకల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏ ఎస్ ఐ ) వారి తవ్వకాలు కూడ ఈ పట్టణం గతంలో ఒక చారిత్రిక ప్రదేశమన్న వాస్తవానికి సాక్ష్యంగా నిలుస్తాయి. భాన్ గర్ ను సందర్శించే యాత్రికులకు ఇక్కడి అనూహ్య వాతావరణం అశాంతిని కల్గ చేస్తుందనే భయంతో ఏ ఎస్ ఐ వారు సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి తర్వాత ఈ ప్రాంతంలో ప్రవేశం నిషేదించారు.