రాజస్థాన్ లో ఈశాన్య ప్రాంతంలోని ఆల్వార్ జిల్లా లో గల సిల్ సర్ సరస్సు ఏడు చ. కి. మీ. ల మేర విస్తరించిన అందమైన సరస్సు.1845 వ సంవత్సరం లో వినయ్ సింగ్ మహారాజు ఈ సరస్సు ను ఆల్వార్ నగరానికి నీటిని అందించడానికి నిర్మించాడు. వినయ్ సింగ్ మహారాజు తన రాణి శీలా కోసం నిర్మించిన ఒక అందమైన లేక్ ప్యాలెస్ ఇక్కడ ఉంది. దీనిని రాజభవనం, వేట విడిది గా ఉపయోగించే వారు. ప్రస్తుతం ఈ రాజప్రాసాదాన్ని ఆధునిక సౌకర్యాలతో కూడిన ఒక హోటల్ గా మార్చారు. బోటింగ్, సెయిలింగ్ వంటి సౌకర్యాలు ఈ సరస్సు లో అందుబాటులో ఉన్నాయి.