రాజస్థాన్ లోని సికార్ జిల్లాలో 11వ నెంబర్ జాతీయ రహదారి మీద జైపూర్ బికనేర్ మార్గం మధ్యలో ఫతే పూర్ పట్టణం వుంది. ఫతే పూర్ ను 15వ శతాబ్దం మధ్యలో కాయంఖానీ నవాబు ఫతే ఖాన్ స్థాపించాడు. ఈ ప్రాంతం లోని ఇతర పట్టణాల్లాగే ఫతే పూర్ కూడా అలంకరించిన గొప్ప ప్రాసాదాలకు ప్రసిద్ది పొందింది.
1865 లో నిర్మించిన గోయెంకా హవేలీ చాలా గోడ చిత్రాలతో ఇక్కడి ప్రాసాదాలన్నిటిలోకీ ఆసక్తికరమైనదని చెప్తారు. ఇక్కడి పైకప్పు మీద వున్న చిత్రాలు చూడదగ్గవి, ఇక్కడి ప్రాసాదానికి ప్రధాన ఆకర్షణ గా కూడా నిలుస్తాయి.నంద్ లాల్ దేవర, సరవోగి, సింఘానియా ప్రాసాదాలు లాంటి ఇతర చారిత్రిక పర్యాటక ఆకర్షణలు కూడా ఇక్కడ వున్నాయి.



Click it and Unblock the Notifications