కరేరా లో ఉన్న సన్ చిరైయా బర్డ్ సాంచురీ శివపురి నుండి 20 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఇందులో అంతరించబోతున్న అరుదైన పక్షులు ఉన్నాయి. ఈ బర్డ్ సాంచురీ పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తుంది. అభివృద్ధి చెందుతున్న మానవ నాగరికతతో సన్ చిరైయ ఇంకా ఇండియన్ బుస్తర్డ్ అనే పక్షులు అంతరించిపోతున్న వాటిలో కలిసిపోతున్నాయి.
అయినా కొన్ని ప్రదేశాలలో వీటిని గమనించవచ్చు. వీటిని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ సాంచురీలు ఇందులో ఉన్న ఈ రకాలు అంతరించిపోకుండా ఉండేందుకు అనుగుణంగా పర్యావరణాన్ని ఏర్పాటు చేస్తాయి. కాంక్రీట్ జంగల్ లో అటువంటి వాతావరణం అసాధ్యం. సన్ చిరైయ అనే పక్షి దాదాపు అంతరించిపోవడానికి సిద్దంగా ఉన్న పక్షి. ఈ సాంచురీ లో మాత్రమే కనిపిస్తుంది. శివపురికి సమీపం లో ఉన్న ఈ సాంచురీ లో వైల్డ్ లైఫ్ ఔత్సాహికులు ప్రకృతి ఒడిలో సేద దీర వచ్చు.