Search
  • Follow NativePlanet
Share
» »సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.దేశంలో ప్రసిద్ధదేవాలయాలలో మహారాష్ట్రలోని షిరిడీ ఒకటిగా చెబుతారు. సాయిబాబా అంటే మనిషిరూపం దాల్చిన దేవుడిగా ఆయనను భక్తులు నమ్ముతారు.

By Venkatakarunasri

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.దేశంలో ప్రసిద్ధదేవాలయాలలో మహారాష్ట్రలోని షిరిడీ ఒకటిగా చెబుతారు. సాయిబాబా అంటే మనిషిరూపం దాల్చిన దేవుడిగా ఆయనను భక్తులు నమ్ముతారు.ఈయనను సాధువుకనుక హిందువులు శివునిఅవతారంగా సాయిబాబాను కొలుస్తారు. అయితే సాయిబాబా సమాధిఅనంతరం షిరిడీలో ఆయనకొక ఆలయాన్ని నిర్మించారు. ఇదిలావుంటే ఇక్కడ వెలసిన సాయిబాబా ఆలయం దక్షిణ షిర్డీగా కొలుస్తూ చాలా ప్రాముఖ్యతను సంచరించుకుంది.మరి ఆ ఆలయం ఎక్కడుంది?ఆ ఆలయ విశేషాలు ఏమిటి?అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. షిర్డీ సాయిబాబా ఆలయం, 70 సంవత్సరాల క్రిందట నిర్మించిన ప్రత్యెక ప్రాంతం. అతిపెద్ద సాయిబాబా ఆలయాలలో ఒకటైన ఈ ఆలయం 1.5 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఆలయం తుంగభద్రా నది ఒడ్డుపై ఒక రజకునిచే నిర్మించబడింది. ఇది నక్షత్రం ఆకారంలో వుంటుంది. ఈ ఆలయంలో లక్ష్మీ దేవి, హనుమంతుని విగ్రహాలు కూడా ఉన్నాయి.

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

ఈ ఆలయ వాతావరణం చల్లగా, నిర్మలంగా ఉంటుంది. అన్ని సమయాలలో ఈ ఆలయాన్ని సందర్శించ దగినప్పటికీ, పూజలు నిర్వహించే ఉదయం, సాయంత్ర సమయాలు సందర్శనకు అనుకూలంగా ఉంటాయి, ఈ నదినుండి వీచే చల్లని గాలి ఈ ప్రదేశాన్ని ఎంతో ఆహ్లదపరుస్తుంది. షుమారు 800 మంది ప్రజల సామర్ధ్యం గల పెద్ద ధ్యాన మందిరంలో ధ్యానం చేయవచ్చు. ఈ ఆలయం కొండారెడ్డి బురుజుకి దగ్గరలో ఉండడం వల్ల సులభంగా చేరుకోవచ్చు.

PC:youtube

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలుజిల్లాలో జిల్లాకేంద్రమైన కర్నూలుపట్టణంలో తుంగభద్రానది తీరమున శ్రీ షిరిడీసాయిబాబావారి ఆలయం కలదు. ఈ ఆలయంలో సాయిబాబా సాదుపురుషుడిగా ఆలయంనందు ఆరాధించబడుచున్నాడు.

PC:youtube

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

ఈయన మానవరూపంలో అవతరించి పూర్ణపురుషుడుగా భక్తులచే కొనియాడబడిన మహాత్ముడు.ఇక ఈ ఆలయవిషయానికొస్తే అతిపెద్ద సాయిబాబా ఆలయాలలో ఒకటైన ఈ ఆలయం 1.5ఎకరాలలో విస్తరించివుంది.

PC:youtube

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

ఈ ఆలయం తుంగభద్రానదిఒడ్డుపై ఒక రజకునిచే నిర్మింపబడింది. ఈ ఆలయంలో లక్ష్మీదేవి, హనుమంతునివిగ్రహాలు కూడా వున్నాయి. ఈ ఆలయంలో సుమారు 800ప్రజల సామర్ధ్యంగల పెద్ద ధ్యానమందిరంలో ధ్యానం చేయవచ్చు.

PC:youtube

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

ఇదిలావుంటే సాయిబాబా ఎవరికిజన్మించారో,ఎప్పుడుజన్మించాడనే విషయాలు ఇప్పటికీ ఎవ్వరికి తెలీదు. కాని కొన్ని కధలప్రకారం ఒక బ్రాహ్మణకుటుంబంలో పుట్టి ఒక పకీరు సంరక్షణలో పెరిగినట్టు చెబుతారు.

PC:youtube

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

అంతేకాకుండా పకీరు భార్య తనను సేలుకు చెందిన వెంకూసాకు అప్పగించినట్లు తాను వెంకూసా వద్ద 12యేళ్ళు శిష్యరికంచేసినట్లు సాయిబాబాచెప్పినట్లు చెబుతారు. ఇంకా 16సంల ప్రాయంలో బాబామహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చారని,అక్కడ 3యేళ్ళు వుండి తర్వాత కొంతకాలం కనిపించలేదని మళ్ళీ ఒక సంతర్వాత షిరిడీకి తిరిగివచ్చారనే కధనాలు వున్నాయి.

PC:youtube

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

ఈ విధంగా దక్షిణ షిరిడీగా పేరుగాంచిన తుంగభద్రానదితీరంలో వెలసిన ఈ సాయిబాబామందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ నగరం వైశాల్యంలో పెద్దది, అతి పెద్ద జనాభా కల నగరం. 1953 నుండి 1956 వరకు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉండేది. కర్నూలు నగరం హంద్రి నది, తుంగభద్రా నదుల ఒడ్డున దక్షిణం వైపు ఉంది.

PC:youtube

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

కర్నూలు అతిపెద్ద జిల్లా. ఇది హైదరాబాదు నుండి షుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి కడప, చిత్తూర్, అనంతపూర్ చేరడానికి కర్నూల్ గుండా ప్రయాణించవలసి ఉండటం వల్ల దీనిని రాయలసీమ ప్రవేశ ద్వారం అంటారు. ఈ ప్రాంతం చిన్న ఊళ్ళ అందం, అతిధి సత్కారాల సంస్కృతితో పర్యాటకులలో ఒక మంచి అనుభూతిని కల్గిస్తుంది.

PC:youtube

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

చారిత్రక సంస్కృతి, సాంప్రదాయ సంపదతో ఈ ప్రాంతం ఒక అద్భుత పర్యాటక కేంద్రంగా మారింది. చారిత్రిక వివరం ప్రాచీన సాహిత్యం, శాసనాల్లో చెప్పబడినట్టు కందనవోలు అనే తెలుగు పదం నుంచి కర్నూల్ అనే పేరు వచ్చింది. కర్నూల్ కి వేల సంవత్సరాల చరిత్ర వుంది.

PC:youtube

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

కర్నూల్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో వున్న కేతవరంలో దొరికిన రాతి చిత్రం ప్రాచీన రాతి యుగం నాటిది. జుర్రేరు లోయ, కటవాని కుంట, యాగంటి లలో లబించిన రాతి శిల్పాలు 35000 నుంచి 40000 ఏళ్ళ నాటివి. మధ్య యుగాలలో భారత దేశాన్ని సందర్శించిన జువాన్ జాంగ్ అనే చైనా దేశపు పర్యాటకుడు తన కధనాల్లో కరాచీ వెళ్ళే దారిలో కర్నూల్ ను దాటానని రాసుకున్నాడు.

PC:youtube

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

ఏడవ శతాబ్దంలో కర్నూల్ బిజాపూర్ సుల్తాన్ల పాలనలో వుండేది. అంతకు ముందు దీన్ని శ్రీ కృష్ణదేవరాయల వారు పాలించారు. 1687 లో ఈ ప్రాంతాన్ని ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చేజిక్కించుకుని దీన్ని నవాబుల అధీనంలో వదిలేశాడు. తరువాత నవాబులు స్వాతంత్ర్యం ప్రకటించుకుని కర్నూల్ ను 200 ఏళ్ళ పాటు స్వతంత్రంగా పాలించారు.

PC:youtube

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

18వ శతాబ్దంలో నవాబులు బ్రిటిష్ వారి తో పోరాడారు. పురాతన కట్టడాలు, ఆలయాల నగరం పురాతన కట్టడాలు, చారిత్రిక నిర్మాణాలు పట్ల ఆసక్తి కలిగిన పర్యాటకులకు, కర్నూలు అటువంటి ప్రదేశాలను విస్తృతంగా అందిస్తుంది. మధ్య యుగంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించిన కోటల శిధిలాలలో పురాతన కాలపు అరబ్బీ, పర్షియా శాసనాలు ఉన్నాయి.

PC:youtube

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

ఈ కోటను తప్పక సందర్శించాలి. కొండారెడ్డి బురుజు, అబ్దుల వహాబ్ సమాధి చూడదగిన అద్భుత ప్రదేశాలు. కర్నూల్ పాలకుల వేసవి విడిది, వరద రక్షిత గోడ, కొన్నిప్రాముఖ్యత కల్గిన పేట ఆంజనేయస్వామి ఆలయం, నగరేశ్వరస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం, షిర్డీ సాయి బాబా ఆలయం కూడా చూడ దగిన ప్రదేశాలు. కర్నూలు నవంబరు, డిసెంబర్ నెలలలో ప్రసిద్ధ రధొత్సవాన్ని కూడా నిర్వహిస్తుంది. ఈ పండుగ ఎనిమిది రోజుల పాటు జరుగుతుంది. దీనిని ఆంజనేయస్వామి పేరున జరుపుకుంటారు.

PC:youtube

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా

బెంగుళూర్, చెన్నై నగరాల నుండి బస్సు సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు సర్వీసులు చాలా చౌకగా, తేలికగా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి కర్నూలుకు సరైన ధరలలో కాబ్స్ కూడా తేలికగా అందుబాటులో ఉన్నాయి.

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

రైలు ద్వారా

కర్నూలు లో కర్నూల్ పట్టణం, ఆదోని, నంద్యాల, ధోన్ జంక్షన్ అనే నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఇవి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్నాయి. హైదరాబాద్ నుండి రైలులో, అక్కడ నుండి రోడ్డు ద్వారా కర్నూలుకి రైలు ప్రయాణం చాలా తేలిక. కర్నూల్ కి స్థానిక రైళ్ళు కూడా అందుబాటులో ఉన్నాయి.

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి మీకు తెలుసా?

వాయు మార్గం ద్వారా

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ౦, కర్నూలుకి సమీప విమానాశ్రయం. కర్నూల్ నగరం నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి షుమారు మూడున్నర లేదా నాలుగు గంటలు పడుతుంది. విమానాశ్రయం నుండి కర్నూలు నగరానికి కాబ్స్ అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ విమానాశ్రయం, దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు అనుసంధానించబడి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X