దీనిని 1925వ సంవత్సరంలో కట్టించారు. ఈ భవనాన్ని ఫిదా హుసైన్ అబ్దుల్ హుసైన్ సందల్వాల కట్టించారు. ఈ భవననిర్మాణశైలి పురాతన భారత నిర్మాణ శైలిని పోలి ఉంటుందని చాలా మంది చెపుతారు మరియు ఈ రకమైన నిర్మాణాన్ని ఈ రోజుల్లో చూడలేమని చెపుతారు.
ఉజ్జయిని మరియు జైపూర్ యొక్క కళాకారులు ఈ ప్రసిద్ధ భవన నిర్మాణానికి చాలా కష్టపడ్డారు. ఈ భవనం చూసిన తర్వాత చూసినవారికి ఒక వాంఛనీయ అనుభూతి కలుగుతుంది. ఈ భవనాన్ని ఉజ్జయిని నగరంలోనే ఒక గొప్ప నిర్మాణ కళాఖండంగా చెపుతారు మరియు ఎవరైతే ఉజ్జయినిలోని R.P భార్ఘవ్ మార్గ్ దర్శించినవారికి ఈ ప్రసిద్ధ భవనం ఒక మధురానుభూతిని మిగులుస్తుంది.
ఈ భవనం ఇప్పుడు ఉజ్జయినీ మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్నది. భవనం యొక్క లోపలిభాగాన్ని సందర్శించే వ్యక్తికి, ఇది ఒక రాజభవనంలాగానే కనిపిస్తుంది. ప్రస్తుత సమయంలో ఫిదా హుస్సేన్ సందల్వాల వారసులు ఈ భవనంలో నివసిస్తున్నారు.