1423 లో సుల్తాన్ అహ్మద్ షా పాలనా కాలం లో నిర్మితమైన, ప్రారంభించబడిన ఈ జమ్మా మసీదు చక్రవర్తుల వ్యక్తిగత ప్రార్ధనా స్థలం. పసుపు పచ్చటి ఇసుకరాతితో తయారయిన ఈ మసీదులో కోర్ట్ యార్డ్ ని పాల రాతితో నిర్మించడం విశేషం. చుట్టూతా ఉన్నటువంటి స్తంభాల పైన అరబిక్ వ్రాత ప్రతులు గమనించవచ్చు. రెండు మినార్లు 1819 లో సంభవించిన భూకంపాలాలో శిధిలమైనవి. ఈ మసీదు యొక్క ప్రార్ధనా గది 15 డోములతో 260 స్తంభాల తో ఉంటుంది.
ఈ మసీదులో జైనుల మరియు హిందువుల కు సంబంధించినటువంటి అనేక మూలాంశాలు చెక్కబడి ఉన్నాయి. మధ్యలో ఉన్నటువంటి డోము తామరపూవులాంటి జైన్ మందిరాలలోని నిర్మాణాలని పోలి ఉంటుంది. అంతే కాక, స్తంభాలపై వేలాడదీయబడిఉన్న గంటలు హిందువుల మందిరాలలోని గంటలని పోలి ఉంటాయి. అంతే కాకుండా, ఇక్కడ ఉన్న ఒకానొక కిటికిలో 'ఓం' చిహ్నంచెక్కబడి ఉంది. అన్ని మతాలకు చెందిన పర్యాటకులు ఈ మసీదులోకి ప్రవేశించవచ్చు. కానీ, ప్రార్ధనలు జరిగే సమయం లో మౌనం వహించాలని చెప్తారు. తలపాగా ధరించి ప్రార్ధనా సమయం లో మసీదులోకి ప్రవేశించవచ్చు. మహిళలని ముఖ్య హాల్ లో ని కి అనుమతించరు.
అహ్మద్ షా, అతని కుమారుడు మరియు మనవళ్ల సమాధులు ఈ మసీదుకి పశ్చిమ వైపున ఉన్నాయి. వాటి సమీపాన క్వీద్ మరియు ఇతర భార్యల సమాధులు ఉన్నాయి.



Click it and Unblock the Notifications