ఒకప్పుడు నలువైపులా కుడ్యాలు గల ఢిల్లీ నగరం లోనికి ప్రవేశించడానికి ఉపయోగపడిన గేట్.ఇది ప్రస్తుతం పాత ఢిల్లీ గా పిలవబడే షాజహనా బాద్ కి ఉత్తర భాగం లో ఉంది. ఈ గే టు ని మిలటరీ ఇంజనీరు రాబర్ట్ స్మిత్ 1835 లో నిర్మించాడు. ఈ గేటు ప్రవేశద్వారం కాశ్మీరు కి వెళ్ళే దారి వైపు ఉండటం తో ఈ గేటు కి కశ్మీరీ గేటు అనే పేరు వచ్చిందిట.
భారత స్వాతంత్ర్య సంగ్రామం లో ఈ గేటు ముఖ్య భూమిక పోషించింది. 1857 లో స్వాతంత్ర్య సమర యోధులు బ్రిటీష్ సైన్యం తో తలపడి ఢిల్లీని స్వాధీన పరచుకున్నది ఇక్కడే. ఈ గేటు చుట్టు పక్కల గల ప్రాంతాన్ని కూడా కాశ్మీరీ గేటు అనే పిలుస్తారు.పాత ఢిలీ రైల్వే స్టేషన్ కూడా కాశ్మీర్ గేటు పరిసర ప్రాంతం లోనే ఉంది. ఈ స్టేషను కి కాశ్మీరు గేటు నుండి ఒకటి, చాందినీ చౌక్ నుండి మరొక ప్రవేశ ద్వారాలున్నాయి. ఢిల్లీ గేటు,సెయింట్ జేంస్ చర్చ్ ఈ చుట్టు పక్కల గల ఇతర దర్శనీయ స్థలాలు. ప్రస్తుత ఢిల్లీ మెట్రో స్టేషన్ కూడా కాశ్మీరు గేటు దగ్గరే ఉంది. పగటి పూట కాశ్మీరు గేటు పరిసర ప్రాంతాలు వ్యాపార లావా దేవీ లతో రద్దీ గా ఉంటాయి.